

వెదురుకుప్పం, మన న్యూస్ ప్రతినిధి: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెరుమాళ్ళుపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ జన్మదినోత్సవం పురస్కరించుకుని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకులు, అభిమానులు, గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొని వేడుకను ప్రత్యేకంగా మార్చారు.ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీటీసీ, మాజీ టిడిపి మండల అధ్యక్షులు మోహన్ మురళి డాక్టర్ థామస్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, “డాక్టర్ వి.ఎం.థామస్ ఓ ప్రజాహితంపై దృష్టి ఉన్న ప్రజాప్రతినిధి. ఆయన నాయకత్వంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం అభివృద్ధి బాటలో దూసుకుపోతోంది” అని అన్నారు.ఈ వేడుకలో స్థానిక సర్పంచ్ శశికల ఆనందరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు బోడిరెడ్డి రామకృష్ణారెడ్డి, టిడిపి ప్రముఖులు వెంకటేష్, తిరుమలరెడ్డి, శ్రీనివాసులు, భాస్కర్, లవ్ కుమార్, మధు, ముని, చిరంజీవి నాయుడు, ఏఎంసి. రెడ్డి, కె.సి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.పలు రాజకీయ పార్టీకి చెందిన నాయకులు పార్టీ భేదాలు మరిచి, డా. వి.ఎం. థామస్ కు శుభాకాంక్షలు తెలియజేయడం ఈ వేడుకకు విశిష్టతను చేకూర్చింది. గ్రామ యువత ఆయనకు ప్రత్యేకంగా బర్త్డే పోస్టర్లు ఏర్పాటు చేయడం, అభివాదాలు తెలుపుతూ ర్యాలీలు నిర్వహించడం ఆకర్షణగా నిలిచింది.వేడుకల అనంతరం గ్రామ పెద్దల ఆశీస్సులు తీసుకుని, అన్ని వర్గాలకు సేవచేయాలనే సంకల్పాన్ని పునరుద్ఘాటించినట్లు నాయకులు వెల్లడించారు.