భూసారం బాగు నవధాన్యాలు సాగు వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట జూన్7 := పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో నవధాన్యాలను సాగు చేసి 30 లేదా 40 రోజుల తర్వాత కలియ దున్నడం ద్వారా భూసారం ఎంతో మెరుగు పడుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. హాజరు మరియు కంకణాపల్లి గ్రామాలలో గ్రామ వ్యవసాయ సహాయకులు నాగమణి మరియు మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో నవధాన్యాల సాగుపై ఏర్పాటు చేసిన గిరిజన రైతుల అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ నవధాన్యాలు ఒక కొత్త శాస్త్రీయ విధానం అని వీటిని కలియ దున్నడం ద్వారా భూసారాన్ని ఎంతో మెరుగుపరుచుకోవచ్చని గిరిజన రైతులు ముఖ్యంగా వరి పంటను కేవలం తమ ఇంటి అవసరాల కోసమే వినియోగిస్తారని కాబట్టి నవధాన్యాలు సాగు చేసి కలియదున్ని అనంతరం వరి పంటను నాటడం ద్వారా రసాయన ఎరువులు మరియు పురుగుమందులు వినియోగించకుండానే నాణ్యమైన పంట పండుతుందని కాబట్టి గిరిజన రైతులందరూ నవధాన్యాలను సాగు చేసుకోవాలని సూచించారు జీడి మామిడి తోటల దిగుబడికి నవధాన్యాలను కలియదున్నాలని తెలిపారు నవధాన్యాలు పశువుల మేతగా పనికి వస్తాయని పాలలో వెన్న శాతం పెరుగుతుందని అంతేకాకుండా 15 నుండి 20 రకాల వేరు వ్యవస్థలు భూమిలోనికి చేరడం వలన కొన్ని కోట్ల జీవ వైవిధ్యం వేర్ల చుట్టూ చేరి అత్యంత విలువైన పోషకాలను పంటకు అందిస్తాయని ఇది ఒక కొత్త శాస్త్రీయ విధానమని తెలిపారు. అలాగే కొర్ర మరియు చోడి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని 90% రాయితీపై గిరిజన రైతులకు అందిస్తున్నామని రాగులు కిలో 49 రూపాయలకు పైగా మద్దతు ధర లభిస్తుందని కాబట్టి చిరుధాన్యాల విస్తీర్ణాన్ని పెంచాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రకృతి సేద్య యల్ వన్ కొండేటి విజయ్ మరియు రైతులు పాల్గొన్నారు.

  • Related Posts

    నెల్లూరులో జూన్ 8న కీర్తిశేషులు ఆనం వెంకట రెడ్డి విగ్రహా పునః ఆవిష్కరణ

    మన న్యూస్ ,నెల్లూరు: .ప్రజా నాయకులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 8 ,ఆదివారం ఉదయం 9:30 గంటలకు నెల్లూరు నగరం రామలింగాపురం “ఆనం వెంకట రెడ్డి సెంటర్” నందు విగ్రహ పునః…

    యోగా తో ఆరోగ్యం,ఆనందం.

    మన న్యూస్ సాలూరు జూన్7:= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం మే 21నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    బక్రీద్ పండుగ వేడుకలు

    • By RAHEEM
    • June 8, 2025
    • 3 views
    బక్రీద్ పండుగ వేడుకలు

    కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ

    కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ

    నెల్లూరులో చివరి దశకు చేరుకున్న విఆర్ హైస్కూల్ ఆధునికరణ పనులు

    నెల్లూరులో చివరి దశకు చేరుకున్న  విఆర్ హైస్కూల్ ఆధునికరణ  పనులు

    నెల్లూరులో దేశంలోనే రోల్ మోడల్ గా విఆర్ హైస్కూల్ ఉండబోతుంది…….. పొంగూరు షరీణి

    నెల్లూరులో దేశంలోనే రోల్ మోడల్ గా విఆర్ హైస్కూల్ ఉండబోతుంది…….. పొంగూరు షరీణి