సమస్యల పరిష్కార వేదికలుగా రెవెన్యూ సదస్సులు.కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

మన న్యూస్,నిజామాబాద్, రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలువాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. రుద్రూర్ మండలం రాణంపల్లి, సాలూర మండల కేంద్రంలో గురువారం నిర్వహించినా రెవెన్యూ సదస్సులను కలెక్టర్ సందర్శించారు.అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిని ఆన్లైన్ లో నమోదు చేస్తున్నారా?అని అధికారులను ఆరా తీశారు. వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.స్వీకరించినా దరఖాస్తులకు రసీదులు అందించాలని,సంబంధిత రిజిస్టర్లలో వివరాలు రాయాలని ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్‌డెస్క్ లను,రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు.సమస్యల వారీగా అర్జీలను విభజిస్తూ, పక్కాగా రికార్డులను పొందుపర్చాలని అన్నారు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. జూన్ 20వ తేదీ వరకు అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులునిర్వహించనున్నామని,భూ సమస్యలున్న ప్రజలు ఈ సదస్సులకు హాజరై దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. సదస్సులలో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, సానుకూలంగా ఉన్న సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ సమస్యను పరిష్కరించేందుకు నిబంధనలు అంగీకరించని పక్షంలో దరఖాస్తుదారుడికి ఆ విషయాన్ని స్పష్టంగా అర్ధమయ్యే రీతిలో తెలియజేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తుదారులను పదేపదే తిప్పుకోకూడదని, సదస్సులో అర్జీలు అందించేందుకు వచ్చే వారితో సున్నితంగా వ్యవహరించాలని రెవెన్యూ బృందాలకు హితవు పలికారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, పూర్తి రికార్డుల ఆధారంగానే వాటిని పరిష్కరించాలని సూచించారు. ఈ రెవెన్యూ సదస్సులు ముగిసిన మీదట క్షేత్రస్థాయిలో విచారణ జరపాల్సి ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా చూడాలన్నారు. అర్హులైన వారికి పూర్తి న్యాయం జరిగేలా సానుకూల దృక్పథంతో పని చేయాలని, అప్పుడే భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సార్థకత చేకూరి, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ అన్నారు.కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు.

  • Related Posts

    బక్రీద్ పండుగ వేడుకలు

    మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో శనివారం బక్రీద్ పండుగ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఉదయం నూతన వస్త్రాలను ధరించి గ్రామాల్లోని ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజులు చదువుతారు.ఈద్గాల వద్ద మత గురువులు ఇమాంలు ముందుండి…

    ఘనంగా ఎనుముల కొండల్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చంపాపేట్. మన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల కొండల్ రెడ్డి జన్మదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కబడ్డీ చైర్మన్ తుమ్మలూరు మాజీ సర్పంచ్ మద్ది కర్ణాకర్ రెడ్డి చంపాపేట్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    బక్రీద్ పండుగ వేడుకలు

    • By RAHEEM
    • June 8, 2025
    • 3 views
    బక్రీద్ పండుగ వేడుకలు

    కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ

    కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ

    నెల్లూరులో చివరి దశకు చేరుకున్న విఆర్ హైస్కూల్ ఆధునికరణ పనులు

    నెల్లూరులో చివరి దశకు చేరుకున్న  విఆర్ హైస్కూల్ ఆధునికరణ  పనులు

    నెల్లూరులో దేశంలోనే రోల్ మోడల్ గా విఆర్ హైస్కూల్ ఉండబోతుంది…….. పొంగూరు షరీణి

    నెల్లూరులో దేశంలోనే రోల్ మోడల్ గా విఆర్ హైస్కూల్ ఉండబోతుంది…….. పొంగూరు షరీణి