

మన న్యూస్, కోవూరు:- “ఇంటింటికీ రేషన్” రేషన్ పేరుతొ అక్క చెల్లెళ్లను వీధుల్లో నిలబెట్టారు. – గతంలో వేళా పాళా లేని విధానంతో ప్రజలు చాలా అవస్థలు పడ్డారు. – ప్రజల కోరిక మేరకే రేషన్ షాపు వద్ద సరుకులు పంపిణి చేసే పాత విధానం కొనసాగింపు. – సరుకుల వివరాలను నోటీసు బోర్డ్ ద్వారా సమాచారం అందించాలని డీలర్లకు ఆదేశం. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఇంటిటికి రేషన్ సరుకుల పేరిట గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దే ఉద్దేశంతో ప్రజల కోరిక మేరకే రేషన్ షాపుల వద్దే సరుకులు పంపిణి చేసే పాత విధానాన్ని అమలులోనికి తీసుకు వచ్చామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి .కోవూరు పంచాయతిలోని పాటూరు రోడ్డులో చౌక ధరల దుకాణాన్ని సందర్శించి సరుకుల పంపిణి విధానాన్ని ఆమె పరిశీలించారు. ఇంటిటికి రేషన్ సరుకుల పేరుతొ గత ప్రభుత్వం మొత్తం ప్రజా పంపిణి వ్యవస్థనే అస్తవ్యస్తంగా మార్చిందన్నారు. గతంలో రేషన్ సరకుల వాహనం ఎప్పుడొస్తుందో తెలియదని, ఎక్కడికొస్తుందో కూడా తెలియని పరిస్థితులలో ప్రజలు రోడ్ల మీద పడి గాపులు కాసే పరిస్థితి వుండేదన్నారు. “ఇంటింటికీ రేషన్” రేషన్ పేరుతొ అక్క చెల్లెళ్ల గత ప్రభుత్వం వీధుల్లో నిలబెట్టిందన్నారు. వేళా పాళా లేని రేషన్ పంపిణి విధానంతో ప్రజలు చాలా అవస్థలు పడ్డారన్నారు. 1 వ తేదీ నుండి 15వ తేదీ లోపల ఏ రోజైనా కార్డుదారులు చౌక దుకాణాల్లో సరుకులు పొందవచ్చన్నారు. రేషన్ షాపుల్లో సరుకుల వివరాలను ఎప్పటికప్పుడు నోటీసు బోర్డ్ ద్వారా సమాచారం అందించేలా డీలర్లను ఆదేశించామన్నారు. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు అలాగే అర్హులైన దివ్యాంగులకు ఇంటి వద్దకే సరుకులను అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిత్యావసర సరుకులను చౌక దుకాణాలలో పారదర్శకంగా పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు అధికారులు పర్వవేక్షిస్తున్నారని ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సరుకులు పంపిణి చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి డీలర్లను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దారు నిర్మలానంద బాబా, ఎంపీడీఓ శ్రీహరి రెడ్డి, సర్పంచ్ యాకసిరి విజయమ్మ, పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాలరెడ్డి, జొన్నవాడ ఆలయ సేవా కమిటి ఛైర్మన్ తిరుమూరు సుధాకర్ రెడ్డి, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



