

మన న్యూస్, నెల్లూరు, మే 30: నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వైఎస్ఆర్సిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున పాత్రికేయ సమావేశం నిర్వహించి నిర్వహించినారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం.. వైయస్ఆర్సీపీ నేతలపై వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నలుపు వస్త్రాలు ధరించి.. చేతికి నల్ల వస్త్రాలను సంకెళ్లుగా వేసుకుని .. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం.. ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి నేతలపై.. అక్రమ కేసులు బనయిస్తుండడం.. దుర్మార్గమని చాటారు. ఈ సందర్భంగా ఊటుకూరు నాగార్జున మాట్లాడుతూ……….ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికొదిలేసి.. ప్రతిపక్ష పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ పైశాచిక ఆనందం పొందుతుందన్నారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు,మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై పెట్టిన అక్రమ కేసు అందుకు నిదర్శనమేనన్నారు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను వారి ఆకృత్యాలను ప్రజలకు తెలియజేసినందుకే గోవర్ధన్ రెడ్డి పై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు.కాకాని గోవర్ధన్ రెడ్డి ని జైల్లో పెట్టడంతో కూటమి నేతలు ఏదో ఘనకార్యం చేసినట్లు జబ్బలు చేరుచుకుంటున్నారని అన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలోనే కాదు యావత్ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రతిపక్ష పార్టీ నేతలపై వారు పెడుతున్న అక్రమ కేసులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. నెల్లూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందించారని తెలిపారు. మంత్రి గా కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రజల కోసం పరితపిస్తున్న నాయకుడిగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆయన ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడని కొనియాడారు.అలాంటిది ఈరోజు అధికార పార్టీ తీరును ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తున్నారన్న కారణంతోనే ఆయనపై అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారని ఆరోపించారు. గతంలో ఎంతో మంది నెల్లూరు జిల్లాలో రాజకీయాలు నడిపిన..ఎంతో హుందాగా నడిపారని ఇలా వ్యక్తిగత స్వార్థాలకు రాజకీయాలను ఉపయోగించుకున్న వారు లేరన్నారు.ఈరోజు జిల్లాలో ఎక్కడా లేనటువంటి సంస్కృతిని కూటమి ప్రభుత్వ నాయకులు అమలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రజలు వారి తీరును అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఈరోజు అక్రమ కేసులు పెడుతూ వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేయడమేనన్నారు.మీరు ఈ రోజు ఎన్ని అక్రమ కేసులు పెట్టిన మా నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భరోసాతో ఇలా ముందుకు పోతూ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పత్రిక ముఖంగా ఎండగడతామన్నారు. అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలను కూడా చేపడుతున్నామన్నారు. రేపటి రోజున మా ప్రభుత్వం వస్తే మీరు ఇబ్బంది పెట్టినట్టుగా మేము వ్యవహరిస్తే తెలుగుదేశం పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి చెప్పుకోవడం కాదు కదా కనీసం రోడ్ల మీదకు వచ్చి తిరగలేరన్నారు.ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పెడుతున్న అక్రమ కేసులు చూస్తుంటే సర్వేపల్లి లోని తెలుగుదేశం పార్టీ నేతలే ఉలిక్కిపడుతున్నారని రేపు వైసీపీ ప్రభుత్వం వస్తే మా పరిస్థితి ఏంటా అన్న సందిగ్ధం వారిలో నెలకొందన్నారు. న్యాయవ్యవస్థ పై తమకు నమ్మకం ఉందని మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని ఈ కేసు నుంచి క్లీన్ చిట్ తో బయటపడతారని ధీమా వ్యక్తం చేశారు. క్లీన్ చిట్ తో కాకాని గోవర్ధన్ రెడ్డి బయటకు వచ్చిన రోజు గర్జించే గళంతో కూటమి ప్రభుత్వ తీరును ఎండగడతారని తెలిపారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు రాబోయే రోజుల్లో మా నాయకులు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సూచనలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి ని అరెస్టు చేసిన నాటి నుంచి వారి కుటుంబానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఏ విధంగా అండగా నిలుస్తున్న తీరు చూస్తేనే ప్రజలకు కార్యకర్తలకు ఆయన ఎలాంటి సేవలు అందించారో అర్థమవుతుందన్నారు. ఇది అక్రమ కేసు అనేందుకు ఉదాహరనే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒకరైన ఈ అరెస్టును గురించి.. సమర్థించక.. పోవడమేనన్నారు.ఈరోజు కూటమి ప్రభుత్వ అక్రమ అరెస్టులకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. అరెస్టులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు భయపడరని మరింత ఉధృతంగా ప్రజల్లోకి వెళ్లి.. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతారని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సిపి యువజన విభాగం నాయకులు చీదెళ్ల కిషన్, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, వైసిపి నాయకులు వెంకటేష్, మీరా, కిషోర్, మస్తాన్, దీపు, మనోజ్, సుమధర్, లోకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
