రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఆలోచనలకు అనుగుణంగా విఆర్ హై స్కూల్ రూపు రేఖలు

మన న్యూస్, నెల్లూరు ,మే 29:- నెల్లూరు విఆర్ హైస్కూల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి – మా నాన్న ఉన్నత స్థితికి విఆర్ హైస్కూల్లో చదువుకోవడమే పునాది- ప్రతి తరగతి గదిలో డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు – ఇంటర్నేషనల్ స్థాయిలో ప్లే గ్రౌండ్ – అనుభవం మెలకువలు తెలిసినా ఉపాధ్యాయులు ఎంపిక – సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చిన మంత్రి కుమార్తె పొంగూరు షరణిభవిష్యత్ తరాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆలోచనలకు అనుగుణంగా వి ఆర్ హై స్కూల్ ను ఇంటర్నేషనల్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి తెలియజేశారు. నెల్లూరు విఆర్ హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ అభివృద్ధి పనులను ఆమె క్షేత్రస్థాయిలో ఎన్సిసి సిబ్బందితో కలిసి పరిశీలించారు. హై స్కూల్ లోని ప్రతి తరగతి గదికి వెళ్లి జరుగుతున్న అభివృద్ధి పనులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రతి తరగతి గదిలో ఏర్పాటు చేసిన 86 ఇంచెస్ డిజిటల్ స్క్రీన్ లను స్వయంగా పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న ల్యాబ్స్ ను తనిఖీ చేశారు. అధునాతన హంగులతో తీర్చిదిద్దుతున్న క్రీడా మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు షరణి మాట్లాడుతూ విఆర్ హైస్కూల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రతిరోజు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. గత కొన్ని రోజులుగా విఆర్ హైస్కూల్లో అభివృద్ధి పనులు శరవేగంగా నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయని తెలిపారు. మా నాన్న ఈ స్కూల్లో చదివారని అయితే అప్పట్లో సరైన వసతులు లేవన్నారు. కానీ ఈరోజు మా నాన్న ఈ స్థాయికి రావడానికి విఆర్ స్కూల్లో చదువుకోవడమే పునాది అని షరణి చెప్పారు. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్న కాబట్టి తాను చదువుకున్న స్కూల్ కి ఏదో ఒకటి చేయాలని మంత్రి నారాయణ మహా సంకల్పానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఆ విధంగా అధునాతన హంగులతో విఆర్ హై స్కూల్ ను తీర్చిదిద్దాలన్న బాధ్యతను తనపై ఉంచారన్నారు. గడిచిన నెల రోజులుగా ఎంతో పట్టుదలతో మంత్రి నారాయణ ఆశయాలకు అనుగుణంగా ఎన్సీసీ వారు ఇక్కడ అభివృద్ధి పనులను శరవేగంగా చేపడుతున్నారని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన అర్థవంతమైన విద్యను అందించేందుకు ప్రత్యేక ప్రణాళికతో విఆర్ హై స్కూల్లో ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 86 ఇంచెస్ స్క్రీన్ తో ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతి గదులు విద్యార్థులను ఎంతగానో ఆకర్షించడంతోపాటు చదువు పట్ల ఆసక్తి చూపేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా వీఆర్ హై స్కూల్లో నూతన టెక్నాలజీకి అనుగుణంగా అన్ని రకాల సబ్జెక్టులకు సంబంధించి ల్యాబ్స్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. మా నాన్న ఆలోచనకు అనుగుణంగా వీఆర్ హై స్కూల్లోని అన్ని తరగతుల గదులలో డిజిటల్ స్క్రీన్స్ ద్వారా విద్యా బోధన చేపడుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్థాయిలో క్రీడా ప్రాంగణాన్ని రూపొందిస్తున్నట్లు పొంగూరు షరణి తెలిపారు. ఏదేమైనా పేదవిద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటర్నేషనల్ స్థాయిలో వీఆర్ హైస్కూల్ ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. స్టీమ్ విధానం ద్వారా విద్యార్థులకు అన్ని సబ్జెక్టులలో అర్థమంతమైన విద్య బోధన చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా హైడ్రో ఫోనిక్స్ టెక్నాలజీని వీఆర్ హైస్కూల్లో ప్రత్యేకంగా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయుల ఎంపిక సైతం శరవేగంగా జరుగుతుందన్నారు. ఒకప్పుడు వి ఆర్ హైస్కూల్ ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉండబోతుందో చేసి చూపించబోతున్నామని పొంగూరు షరణి తెలిపారు.

  • Related Posts

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి