జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాంధీ భవన్ వద్ద జుక్కల్ సీనియర్ కాంగ్రెస్ నాయకుల నిరసన

మన న్యూస్: జుక్కల్ ఎమ్మెల్యే తమకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను విస్మరిస్తూ కాంగ్రెస్ పార్టీకి బలహీన పడటానికి కారణం అవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో జుక్కల్ ఎమ్మెల్యే పై గాంధీభవన్లో టి పి సి సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేయగా. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరి భార సనాయకులకు, కార్యకర్తలకు పదవులు అంటగడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిరసనకు దిగారు.హైదరాబాద్ గాంధీభవన్ లో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పై జుక్కల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫిర్యాదు చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను పట్టించుకోవడంలేదని నియోజకవర్గంలోని ఎనిమిది మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు హైదరాబాద్ లో గాంధీభవన్ కి వెళ్లి టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను కాకుండా బిఆర్ఎస్, బిజెపి వాళ్లను వెంటేసుకుని తిరుగుతున్నాడని, సీనియర్ కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలు పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలుగా నుండి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన నామినేటెడ్ పదవులు తన అనుకూలమైన వారికి అంట కడుతున్నారని లక్ష్మీకాంతరావు పై మండిపడ్డారు ఎమ్మెల్యే లక్ష్మి కాంత్రావు ప్రవర్తన మారకుంటే జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవని కాంగ్రెస్ నాయకులు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు దృష్టికి తెచ్చారు.. సీనియర్ కాంగ్రెస్ నాయకులను విస్మరిస్తూ తనకు ఇష్టమొచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారని సీనియర్ నాయకులు ఆరోపించారు. తక్షణం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సౌ దాగర్ అరవింద్, కమల్ సెట్, వినోద్, సంగమేశ్వర్,జయ ప్రదీప్, అన్ని మండలాల సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

  • Related Posts

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ ఫోరం ఆధ్వర్యంలో నారాయణ పేట జిల్లా పరిదిలోని మక్తల్ పట్టణ కేంద్రంలోని వైష్ణవీ మహిళల జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ…

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    మన ధ్యాస,నారాయణ పేట జిల్లా: తెలంగాణ రాబిన్ హుడ్, పేద ప్రజల ఆరాధ్య దైవం పండుగ సాయన్న అని.. సమాజంలో అట్టడుగు వర్గాల కోసం కృషిచేసిన మహనీయుడు పండుగ సాయన్న అని మక్తల్ మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు కోళ్ల వెంకటేష్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు