సోమిశెట్టి మధుసూదన్‌ కుటుంబానికి తోడుగా ఉంటాం

మనన్యూస్,కావలి:రాష్ట్ర ప్రభుత్వం తరఫున 10 లక్షల చెక్కు అందజేసిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,ఉగ్రవాదంపై చర్యలకు కేంద్రం సిద్ధం అవుతోంది.ఎంపీ వేమిరెడ్డి
ఉగ్రవాద దాడిలో మృతి చెందిన కావలి పట్టణానికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కుటుంబ సభ్యులను నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, నుడా ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆదివారం పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి పది లక్షల చెక్కును కావలి ఆర్డిఓ వంశీకృష్ణ ఆధ్వర్యంలో నేతలు అందజేశారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ…..దేశంలో ఉగ్రవాద దాడి జరగడం దురదృష్టకరమన్నారు. దాడిలో కావలికి చెందిన మధుసూదన్‌ మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ స్థితిగతులను పరిశీలించామని, తప్పకుండా ప్రభుత్వం తరఫున తగిన న్యాయం చేస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన 10 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వారికి అందాల్సిన సదుపాయాలను అందజేసే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే కుటుంబంలో ఒకరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా తాము ప్రయత్నిస్తామని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలకు మేమంతా కట్టుబడి ఉంటామని, పాకిస్తాన్‌పై ప్రతీకారం తీసుకునేందుకు కేంద్రం చూస్తోందన్నారు. ఇప్పటికే సింధూ జలాలను నిలిపివేసిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబంలో పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని వివరించారు.
ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాట్లాడుతూ…..ఉగ్రవాద దాడులు జరగడం దురదృష్టకరమని, మధుసూదన్ రావు మృతి చెందడం కుటుంబానికి తీరని లోటన్నారు. మధుసూదన్ కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం తరఫున 10 లక్షలు చెక్కును అందజేశామని చెప్పారు. పాకిస్తాన్ చర్యలను ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఎదుర్కొందామని, ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భారతదేశం ఏకం అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. కని పెంచిన తల్లి,తండ్రులకు వృద్దాప్యం లో చేదోడు గా ఉండాలని విదేశాల్లో ఉన్నత కొలువులను సైతం వదులుకొని వచ్చిన మధుసూదన్ ముష్కరుల బారిన పడి ప్రాణాలు కోల్పోవడం మనస్సును కలిచివేస్తోందని అన్నారు. మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల ఆలోచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తామని, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!