

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: బద్వేల్ పట్టణంలోని స్థానిక ఎన్జీవో హోం నందు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ డి ఎం హెచ్ వో వినయ్ కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో మలేరియా అంతం మనతోనే అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎన్జీవోం నుండి నాలుగురోడ్డు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు.డ్రై డే ఫ్రైడే” అంటే ప్రతి శుక్రవారం నిర్వహించే ఒక ప్రత్యేక కార్యక్రమం. ఇది ముఖ్యంగా దోమల ద్వారా వచ్చే వ్యాధుల నివారణ కోసం ప్రజలకు అవగాహన కల్పించడం మరియు నీటిని శుభ్రంగా ఉంచడం ద్వారా వ్యాధులు వ్యాపకుండా చూడటం లక్ష్యంగా ఉంటుంది. మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహనా కలిపించడం ఈ దినోత్సవ ముఖ్యోద్దేశ్యం కూలర్లు, ట్యాంకులు వంటి వాటిలో నీరు నిల్వ ఉంచవద్దు.ఇంట్లో ఎక్కడ నీరు నిండితే అక్కడ మట్టితో నింపండి. ఆ నీటిలో కిరోసిన్ పిచికారీ చేయండి. దీని వల్ల దోమలు పుట్టవు.మీ శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించండి.అధిక జ్వరం , వణుకు వస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.ఎప్పుడూ దోమతెరను ఉపయోగించాలి.ఇంటి చుట్టూ పురుగుల మందులు పిచికారీ చేయాలి.రోజూ సన్స్క్రీన్ అప్లై చేయడం, క్రమం తప్పకుండా స్నానం చేయాలి.మీ ఇళ్లు, కార్యాలయాల్లోని గదులను ఎయిర్ కండిషన్లో ఉంచండి.మీరు ఆరుబయట లేదా ఎక్కడైనా బహిరంగంగా నిద్రిస్తున్నట్లయితే, పడుకునేటప్పుడు దోమతెరను ఉపయోగించండి.ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా, ఇంటి చుట్టూ పేరుకుపోయిన నీటిని తొలగించాలి.నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో ప్రయాణించడం లేదా బస చేయడం మానుకోండి.పరివాహక ప్రాంతాల్లో మురికినీరు, నిల్వ ఉన్న నీరు, ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని పరిశీలించి, దోమల లార్వాను గుర్తించి నిర్మూలిస్తామని, స్థానికులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. స్థానికంగా జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు మెడికల్ ఆఫీసర్, డాక్టర్ శరత్ చంద్ర, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి వెంగయ్య, హెల్త్ ఆఫీసర్ శివరామిరెడ్డి, హెల్త్ ఆఫీసర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె చంద్రావతి, హెల్త్ సూపర్వైజర్ కె వెంకటమ్మ, మరియు ఏఎన్ఎం ఆశా వర్కర్లు తదుపరులు పాల్గొన్నారు.