

- *రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గిరిబాబు తథ్యం..
- *తనకిచ్చిన బాధ్యతపై కృతజ్ఞతలు తెలిపిన సరమర్ల మధుబాబు…
మన న్యూస్ శంఖవరం (అపురూప్)
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జి ముద్రగడ గిరిబాబు అధ్యక్షతలో నియోజకవర్గ వివిధ విభాగల అధ్యక్షుల సమావేశం కిర్లంపూడి గిరిబాబు స్వయ గృహం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటువలే నియోజకవర్గంలో వైకాపా పార్టీ కొంతమందికి పదవులు కల్పించింది. ఈ తరుణంలో పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుల నియామకమైన సరమర్ల మధుబాబు ని ఇంచార్జి ముద్రగడ గిరిబాబు దుస్సాలువతో సత్కరించి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్బంగా సరమర్ల మధుబాబు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో వైస్. జగన్ ముఖ్యమంత్రి కావడం, ఈ నియోజకవర్గం లో ముద్రగడ గిరిబాబు ఎమ్మెల్యే కావడం తద్యమని తెలియజేసారు. ఈ బాధ్యత ఇచ్చినందుకు ముద్రగడ గిరిబాబు కి కృతజ్ఞతలు తెలియజేసారు, ఈ కార్యక్రమం లో అన్నవరం వార్డ్ మెంబెర్ సింగంపల్లి రాము, న్యాయవాది రాయి శ్రీనివాస్, వాణిజ్య విభాగం అధ్యక్షులు గణేసుల లక్ష్మణ స్వామి, లీగల్ సెల్ అధ్యక్షులు పలివెల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.