సుగంధ పంటల సాగుకు సాయం అందేలా చూడండి

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని కోరిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి పినపాక నియోజకవర్గం ప్రతినిధి, మన న్యూస్ ఎంతో వ్యయ ప్రాయాసలకు ఓర్చి సాగు చేస్తున్న ప్రధాన వాణిజ్య సుగంధ పంట మిర్చి సాగు రైతులకు నష్టాలను మిగులుస్తోందని మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వివిధ పథకాల కింద నిధులు మంజూరు అయ్యేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి కోరారు మంగళవారం ఆయన హైదరాబాదు రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు అనంతరం శాలువాతో సన్మానించి సుగంధ ద్రవ్యాల పుస్తకాన్ని సాంబశివరెడ్డి గవర్నర్ కి బహుకరించారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ అందజేసిన నివేదిక ఆధారంగా ఎమ్మెస్ స్వామినాథన్ కమిటీ సూచనలను సైతం పరిగణలోకి తీసుకొని నిధులు మంజూరు కి చొరవ తీసుకోవాలని గవర్నర్ కి సాంబశివరెడ్డి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, అనుబంధ రంగాలతో పాటు కులవృత్తులు గ్రామీణ లఘు పరిశ్రమలను ప్రోత్సహించేందుకు క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమాలతో పాటు స్ఫూర్తి పథకానికి కేంద్ర ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసేలా చూడాలని గవర్నర్ ని కోరారు ఆత్మ నిర్భర్ భారత్ పథకం ద్వారా పల్లెల్లో కుటీర పరిశ్రమలను పెద్ద ఎత్తున నెలకొల్పాలని సాంబశివరెడ్డి విజ్ఞప్తి చేశారు అనంతరం వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ సమస్యలపై లేఖలను సాంబశివరెడ్డి గవర్నర్ కి అందజేశారు సమస్యలు విన్న గవర్నర్ వర్మ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కామర్స్, ఇండస్ట్రీ శాఖతో మాట్లాడి నిధులు సాధించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జాతీయ సుగంధ ద్రవ్యాల అభివృద్ధి సంస్థ స్పైసెస్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ ఆర్ డాక్టర్ గాది లింగప్ప ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///