ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి.

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని మక్తల్ మండలం గడ్డంపల్లి గ్రామములోని రైతు వేదిక దగ్గర నిర్వహించినా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంగళ వారం ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రారంబించారు.మక్తల్ నియోజకవర్గ ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేటట్లు నిరంతరం శ్రమిస్తూ నేడు రామ్ రెడ్డి లయన్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో వాకిటి శ్రీహరి సేవ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని సేవాసమితి సభ్యులు తెలిపారు.గడ్డంపల్లి,అనుగొండ గ్రామల కాంగ్రెస్ పార్టీ నాయకుల సమన్వయంతో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,మక్తల్ నియోజకవర్గం విద్యా వైద్యానికి చాలా వెనుకబడిన ప్రాంతమని ఇక్కడి ప్రజలు చాలా బీదరికానికి చెందినవారు అని ఈ సంధర్బంగా గుర్తు చేశారు.ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని కంటి వైద్య శిబిరాల తో పాటు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడంలో తన వంతుగా సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు.ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే మాటతో కంటి చూపుకు లోపం ఉన్న వారికి అయోవృద్ధులైనటువంటి వారికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ,కంటి ఆపరేషన్తో పాటు ఉచిత మందులు అద్దాలను అందించడం జరుగుతుందని తెలిపారు.తన యొక్క సేవ సమితి బృందానికి అభినందించారు.సుమారు 135 మందికి పైగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా 75 మందికి పైగా కంటి పొరల్లో ఉన్నట్లు గుర్తించి వారిని ఆపరేషన్ నిమిత్తం కొరకు మహబూబ్నగర్ రామ్ రెడ్డి లయన్స్ హాస్పిటల్ కు ప్రత్యేక వాహనంలో తరలించడం జరిగిందని సేవ సమితి సభ్యులు తెలిపారు. అనంతరం సేవాసమితి సభ్యులను గడ్డంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందించారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి ,పద్మ, సత్యం గౌడ్,విజయ్ ,పోలీస్ శాఖ లింగప్ప, గడ్డంపల్లి హనుమంతు, లక్ష్మారెడ్డి,చంద్రకాంత్ గౌడ్,గణేష్ కుమార్, రమేష్,రామాంజనేయులు,కురుమారెడ్డి, శివారెడ్డి,నాగరాజు, నరేందర్, పరశురాం, కొండప్ప, రాము ,ఏ రవికుమార్, నూరుద్దీన్,అసముద్దీన్, బోయ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 1 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు