వెటర్నరీ వైద్య విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి,,రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

మనన్యూస్,తిరుపతి:ఎంబీబీఎస్,బీడీఎస్,ఆయూష్ వైద్య విద్యార్థులకు అందజేస్తున్న మాదిరిగా తమకూ స్టయిఫండ్ ఇచ్చేలా కృషిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవితను ఏపీ వెటర్నీరీ స్టూడెంట్స్,గ్రాడ్యుయెట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.శనివారం బీసీ సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులపై సమీక్షించడానికి వచ్చిన మంత్రి సవితను నగరంలోని పద్మావతి గెస్ట్ హౌస్ లో వెటర్నరీ వైద్య విద్యార్థులు కలిసి వినతిపత్రమందజేశారు.ఎంబీబీఎస్,బీడీఎస్,ఆయూష్ వైద్య విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున స్టయిఫండ్ పెంచి ఇస్తోందన్నారు.వారి మాదిరిగానే తమకూ స్టయిఫండ్ వచ్చేలా కృషి చేయాలని,ఈ విషయం సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లాలని వారు మంత్రిని కోరారు.అనంతరం పలు సమస్యల పరిష్కరించాలని కోరుతూ మంత్రికి వినతి పత్రమందజేశారు.రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధిలో తమ పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.దీనిపై మంత్రి సవిత స్పందిస్తూ,వెటర్నరీ వైద్య విద్యార్థుల సమస్యలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏపీ వెటర్నరీ స్టూడెంట్స్,గ్రాడ్యుయెట్స్ అసోసియేషన్ ప్రతినిధులు పి.నష్వర్ ఖాన్,కేవీ ధర్మతేజ,ఎం.గుణ కౌశిక్,లోకేశ్ సాయి,రమేశ్, జితేంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    ‎తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-13‎పార్వతీపురం మన్యం జిల్లా కొత్త కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్వస్థలం అయిన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని వెంగంపల్లెలో ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామంలో చిన్నా – పెద్దా అందరూ…

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను కిర్లంపూడి లో శనివారం జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కలిశారు. ఈ సందర్భం గా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

    కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    • By JALAIAH
    • September 14, 2025
    • 3 views
    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

    • By JALAIAH
    • September 14, 2025
    • 5 views
    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి