మణుగూరు ఏరియా ఓసి -2 ఆపరేటర్ల ఔదార్యం అనారోగ్యంతో మృతి చెందిన సింగరేణి కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఓసి-2 ఏ రిలే ఆపరేటర్ల ఆధ్వర్యంలో తమ షిఫ్ట్ లోనే పంపు ఆపరేటర్ గా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన పీ వి కాలనీ వాసి రుద్రాక్షల కృష్ణ కుటుంబానికి ఆదివారం నాడు పీవీ కాలనీలో వారి నివాస గృహానికి చేరుకుని ఏ రిలే షిఫ్ట్ ఇన్ చార్జ్ ఎం నరసింహారావు చేతుల మీదుగా డబ్బయి మూడు వేల ఐదువందల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధి మాట్లాడుతూ ఆపదలో ఉన్న తమ తోటి ఉద్యోగి కుటుంబానికి ఆర్థికంగా ఆపన్న హస్తం అందజేసి మేమున్నామంటూ కొండంత మనోధైర్యాన్ని నింపటం ఓదార్పునివ్వడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆపరేటర్ల సేవలను ఆయన కొనియాడారు. తమ తోటి ఉద్యోగులే కాకుండా కష్టాల్లో ఉన్న అనేకమందికి అనేక విధాలుగా పలు సందర్భాలలో తోడ్పాటునందించిన ఏ రిలే ఉద్యోగులను ఆయన ప్రశంసించారు. అందరితో ఎంతో స్నేహభావంగా ఉండే కృష్ణ మృతి ఎంతో బాధాకరమని సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అండర్ మేనేజర్ భార్గవ్,ఇంజనీర్ వెంకటరమణ హెడ్ ఓవర్ మెన్ లు సుదీప్, రాజ్ కుమార్, ఏ రిలే ఆపరేటర్ల తరపున ప్రతినిధులుగా సయ్యద్ నయమత్ హుస్సేన్, కె మల్లికార్జునరావు, భాగం రవికుమార్, గిరీష్ రెడ్డి, శ్రీధర్, చెన్నుపాటి హనుమాన్ బాబు,కొత్త సత్యనారాయణ, ఎండి యాకూబ్ పాషా, అన్నం రాజేందర్, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం మండలానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు పిట్లం టౌన్ ప్రెసిడెంట్ బుగుడల నవీన్ ముదిరాజ్ జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోఎమ్మెల్యే తోట…

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 8, 2025
    • 2 views
    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి