మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మద్నూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా జూనియర్ అసిస్టెంట్ కావేరి,గ్రామ పాలన అధికారి గంగమ్మలను తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ..మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తూ సమాజ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళలు ఏ పనిలో కూడా ముందుండి నడిపించేవారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ శివ రామకృష్ణ, గిర్దావర్ శంకర్, సీనియర్ అసిస్టెంట్ మురళీధర్, జూనియర్ అసిస్టెంట్లు రవి కుమార్, బాలరాజు, ప్రవీణ్, దశరథ్, జీపీఓలు దినకర్, సంతోష్ తదితరులు ఉన్నారు

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *