ఉదయగిరి, జనవరి 25,మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె ).
బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఇది. ఈ స్వాతంత్ర్య సంబరం ఎందరో మహనీయుల త్యాగ ఫలితం. మనకోసం ప్రాణాలర్పించిన మహానుభావుల ఆత్మలకు శాంతి కలగాలి.స్వాతంత్ర్య సమరయోధులు చూపిన బాటలో మనమంతా ముందుకు సాగాలి. వారు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ, వారి ఆశయాలను కొనసాగించేలా ముందడుగు వేద్దాం.దేశభక్తితో మన హృదయాలను నింపుకోవలసిన సమయం ఇది. ఘనమైన మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూనే, ప్రపంచంలోని అన్ని దేశాలకన్నా మన భారతదేశమే మిన్న అనేలా గణతంత్ర ఉత్సవాలను జరుపుకోవాలని ఆకాంక్షించారు.