

మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 12 జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి ఎంఈఓ వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం కేటీ దొడ్డి మండలంలో కేజీబీవీ పాఠశాల ఎంపీహెచ్ఎస్ స్కూల్లో, ఉమిత్యాల, తండాలలో ప్రాథమిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేజీబీవీ పాఠశాలలో వంటగది, మరుగుదొడ్లు, హాస్టల్ పరిసరాలను ఈ సందర్భంగా వంట ఏజెన్సీ వారికి గ్లౌసులు, టోపీలు, మాస్కులు ఎంఈఓ తన సొంత ఖర్చులతో ఖరీదు చేసి వారికి అందజేశారు. అలాగే అప్రాన్స్ ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి ఆధ్వర్యంలో త్వరలో అందజేయనున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతగా వండి పేట్టాలని వంట ఏజెన్సీ వారిని ఆదేశించారు. విద్యార్థుల డైనింగ్ హాల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అలాగే ఉమిత్యల, తాండ లో ఎంపీహెచ్ఎస్, సిపిఎస్ స్కూల్ లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలలో హెడ్మాస్టర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.