కొండాపురం, మన ధ్యాస న్యూస్,డిసెంబర్ 18,(కె నాగరాజు)
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం లోని కొమ్మి గ్రామం కొత్తూరులో టిడిపి కార్యకర్త గుడిపాటి సుబ్బరామయ్య అనారోగ్యము తో బాధపడుతున్న విషయము తెలుసుకొని వారికి 10 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి,కుటుంబాన్ని పరామర్శించిన కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్టు సభ్యుడు చెరుకూరి నవీన్, అనంతరం ఆయన మాట్లాడుతూ కోడె వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ నిత్యం పేద ప్రజల కోసమే శ్రమిస్తుందని ఆయన అన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ కార్యాలయం దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు
