రైతులకు ఇబ్బందులు లేకుండా సోయాబీన్ కొనుగోలు చేస్తాం.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) ,బిచ్కుంద మండలంలోని సోయాబీన్ కొనుగోలు కేంద్రంని గురువారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, ఎన్ సిసి ఎఫ్ అధికారులు,జిల్లా అధికారులు,మార్క్‌ఫెడ్ ప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ..సోయాబీన్ కొనుగోలు ప్రక్రియ,రైతులకు అందుతున్న సేవలు,తూకం రేట్ల విషయాలపై వివరాలు తెలుసుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే యార్డులో నిల్వ ఉంచిన సోయాబీన్ పంటను స్వయంగా పరిశీలించారు.ప్రతి నాణ్యమైన సోయా గింజను రైతుల నుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు తగిన న్యాయం జరిగేలా పర్యవేక్షణ కొనసాగించాలనిసూచించారు.రైతు లు అకాల వర్షాల కారణంగా పంటలో కొంతమంది సోయా గింజలు మట్టి తగిలి సైజు తగ్గినట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.ఈ సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి,వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అలాగే కొనుగోలు కేంద్రంలో సదుపాయాలను మరింత మెరుగుపరచాలని,తూకం యంత్రాలు,వర్షాల సమయంలో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులు ఎటువంటి మోసపూరిత చర్యలకు గురికాకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ సిసి ఆఫ్ స్టేట్ ఆఫీసర్ రవిచంద్ర, దువ్వా వినయ్,మహనమ, ఎన్ సి ఆఫ్ ఎల్ సర్వేయర్ మహేష్,మార్క్‌ఫెడ్ డియం శశిధర్ రెడ్డి,మార్క్‌ఫెడ్ మార్కెటింగ్ ఆఫీసర్ చందు, సంఘ అధ్యక్షులు నాల్చర్ బాలాజీ,కాంగ్రెస్ డెలిగేట్ విఠల్ రెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షులు దర్పల్ గంగాధర్, సంఘ కార్యదర్శి శ్రావణ్ కుమార్,తదితరులు ఉన్నారు.

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం