

అడ్వకేట్ కృష్ణమూర్తి
ఉరవకొండ, మన ధ్యాస:- శ్రీ శైల ప్రాజెక్టు, క్షేత్రంచాలా వేగవంతంగా ఆంధ్రా కోస్తాకు తరలిపోతాందని సీనియర్ అడ్వకేట్ కృష్ణమూర్తి అన్నారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రా కోస్తా ప్రకాశం(ఒంగోల్) జిల్లా విభజించబడి నూతన కొత్త జిల్లాఏర్పడుతున్న మార్కాపురం జిల్లా లోకి శ్రీశైల క్షేత్రము, శ్రీశైల ప్రాజెక్టు, శ్రీశైల మొత్తం మండలం పోతున్నదని తెలిపారు.. శ్రీశైల ప్రాజెక్టు నిర్మాణం కొరకు ఉమ్మడి కర్నూలుజిల్లా రైతాంగం 90 వేల సారవంతం అయిన వ్యవసాయ భూమి యిచ్చి. మన ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులకు ఇంతవరకు నష్ట పరిహారం సక్రమముగా రాలేదు. యింటి కో ఉద్యోగం ఇంతవరకు ఇవ్వ లేదని ఆరోపించారు.. మన రైతులు శ్రీశైల ప్రాజెక్ట్ ముంపులో 70 గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయి అడుక్కొని బ్రతుకుతున్నారు. ఆంధ్రా కోస్తాకు రాయలసీమ ప్రాంతము నుండి తరలి పోయినవి ఈ క్రింది విధముగా ఉన్నాయి. 1. రాయలసీమ అనంతపురం లోపెట్టిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ను ఆంధ్రా ఉత్తర కోస్తా వైజాగ్ కు తరలించుకున్నారు. 2.రాయలసీమ ప్రాంతము కరువు కాటకాలతో ఉంటే బ్రిటీష్ ఇంజనీర్ మెకంజీ చెల్లించి సిద్దేశ్వం దగ్గర పెన్నార్ ప్రాజెక్ట్ మంజూరు చేస్తే ఆంధ్రా కోస్తా వాళ్ళు అడ్డూ తగిలి శ్రీశైల ప్రాజెక్ట్ నిర్మించుకొనారు తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టు కొన్నారు. శ్రీశైల ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ కు కేవలం స్టోరేజ్ ప్రాజెక్టుగా మిగిలించుకొన్నారు. 3.2014 లో రాయలసీమ ప్రాంత కర్నూలు కు మంజూరు చేస్తే, అడ్డుకొని ఆంధ్రా మధ్య కోస్తా మంగళగిరిలో IIMSను పెట్టుకొన్నారు. 4. రాయలసీమ ప్రాంత అనంతపూర్ కు 2014 రాష్ట్ర విభజన ప్రకారం నీట్ కేటాయిస్తేదీనిని ఆంధ్ర మధ్య కోస్తా గుంటూరు జిల్లా న్యూజీ వీడులో పెట్టుకొన్నారు.5.2014 రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాయలసీమ ప్రాంత గుంతకల్ కు రయిల్వే జోన్ కేటాయిస్తే దీనిని ఆంధ్రా ఉత్తర కోస్తా వైజాగ్ లో పెట్టుకో న్నారు. 6.రాయల సీమ ప్రాంతానికికర్నూలుకు APER C కేటాయిస్తేదీనిని కూడా ఆంధ్రా మధ్య కోస్తా అమరావతికి ఎత్తుకెళ్లారు. 7. రాయల సీమ ప్రాంత కర్నూలులో పెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్త ను హ్యూమన్ రైట్స్ కమిషన్, వక్స్ బోర్డు ట్రిబ్యునల్కూడా దాదాపుగా ఆంధ్ర ే కోస్తామధ్య అమరావతికి పోయినట్లే. యిప్పుడు యి కేవలం నామకాస్త్రిగా భౌతికంగా ఉన్న వంటే ఉన్నాయి. యింకా చాలామన రాయల సీమలో పెట్టిన చాలా చాలా సంస్థల్ని ఆంధ్రా కోస్తాకు తరలించారు. 9. చివరకు ఉమ్మడి కర్నూలు జిల్లా లో ఉన్న శ్రీశైల మల్లన్న క్షేత్రం శ్రీశైల ప్రాజెక్ట్ శ్రీశైల మండలము ను ఆంధ్రా దక్షిణ కోస్తా నూతనముగా ఏర్పడ బోయే జిల్లాలో దాదాపు మిళితంచేసుకున్నారని న్యాయవాది కృష్ణమూర్తి తెలిపారు. శ్రీ బాగ్ ఒప్పందాన్ని తక్షణమే అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని న్యాయవాది కృష్ణమూర్తి డిమాండ్ చేశారు.