శ్రీరామరథయాత్రకు రండి…!

మన న్యూస్ : రెబల్ రాజుకు ఆహ్వానం…! త్రిబుల్ ఆర్ కు ఆర్ హెచ్ వి ఎస్ పిలుపు సరేనన్న ఏపీ ఉపసభాపతి తిరుపతి, నవంబర్ అయోధ్యకు వచ్చే ఏడాది మార్చిలో శ్రీరామరథయాత్రను రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన్ ( ఆర్ హెచ్ వి ఎస్ ) నిర్వహించనున్నది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ లతోపాటు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ మేరకు సన్నాహక కార్యక్రమాలు రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి గుండ్రాజు సుకుమార్ రాజు, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవి రాజు, జిల్లా అధ్యక్షులు వి సుబ్రహ్మణ్యం రాజుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణ మారాజు తిరుపతి పర్యటనలో భాగంగా తిరుచానూరు అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి ఘనంగా సన్మానించి శ్రీరామ రథయాత్రకు రావలసిందిగా ఆహ్వానించారు. దీనికి త్రిబుల్ ఆర్ స్పందించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని తప్పకుండా శ్రీరామ రథయాత్రకు కుటుంబ సమేతంగా వస్తానని చెప్పడం ఆనందంగా ఉందని అధికార ప్రతినిధి సుకుమార్ రాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణమరాజు మాట్లాడుతూ హిందూ సామ్రాజ్యంలో రామ రాజ్య స్థాపన కోసం, హిందూ భావజాలాలతోపాటు ఆధ్యాత్మికత సనాతన ధర్మాలను క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు చేరే విధంగా కార్యక్రమాలను రూపొందించడం ఆర్ హెచ్ వి ఎస్ ప్రతినిధులను అభినందించారు. రథయాత్ర సాగే ప్రాంతంలో ప్రతి ఇంటిపై జైశ్రీరామ్ జండా ఎగిరే విధంగా శ్రీరామ సేవకులు కృషి చేయాలని త్రిబుల్ ఆర్ పిలుపునిచ్చారు. భారతదేశం తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని, పద్మావతి అమ్మవారిని ప్రార్థించినట్లు రఘురామ కృష్ణమరాజు పేర్కొన్నారు. తిరుపతి నుండి అయోధ్యకు సాగే శ్రీ రామ రథయాత్ర ముగిసిన తరువాత తదుపరి కార్యక్రమం కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు రెండవ దపా శ్రీరామ రథయాత్ర ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ప్రతినిధులు సుకుమార్ రాజు, శ్రీదేవి రాజు,సుబ్రహ్మణ్యం రాజు పేర్కొన్నారు.

  • Related Posts

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :వాహనదారులు ప్రభుత్వ నియమాలు తప్పక పాటించాలని ఎస్ఐ రామ లింగేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా యర్రవరం పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. వాహనాల సంబంధించిన రికార్డులు పరిశీలిచారు, రికార్డులు సరిగా లేని పలు…

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం జిల్లా సహకార బ్యాంకువద్ద తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏలేశ్వరం, లింగంపర్తి, రాజవొమ్మంగి, అడ్డతీగల (ఎల్లవరం), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.