

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: మండలంలోని ఉత్తరకంచి గ్రామంలో భారతీయ జనతా పార్టీ మాజీ మండల అధ్యక్షులు గున్నబత్తుల రాజబాబు అకాల మరణాన్ని చింతిస్తూ వారి కుటుంబ సభ్యులను కాకినాడ జిల్లా పూర్వ బిజెపి అధ్యక్షులు చిలుకూరి రాంకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మడి వెంకట్రావు సోమవారం పరామర్శించారు.ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కార్య ధర్మరాజు, బిజెపి సీనియర్ నాయకులు వెలుగుల హరే రామ్,ప్రత్తిపాడు బిజెపి అధ్యక్షులు వోటా వీరబాబు,ప్రతిపాడు మండలం ఉపాధ్యక్షులు మదినే బాబ్జి, ప్రతిపాడు మండలం బిజెపి నాయకులు రామకుర్తి సూర్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.