

మన న్యూస్ సాలూరు జూన్7:= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం మే 21నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం లో భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో కమిషనర్ డి.టీ.వీ. కృష్ణారావు మున్సిపల్ సిబ్బంది ,వివిధ శాఖల అధికారులు ఉద్యోగస్తులు, పట్టణ ప్రజలు కలిసి మున్సిపల్ ఆఫీసు నుండి బోసు బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించి తదనంతరము గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో యోగా కార్యక్రమం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యం లో దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు.