

మన న్యూస్ పాచిపెంట జూన్7 := పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో నవధాన్యాలను సాగు చేసి 30 లేదా 40 రోజుల తర్వాత కలియ దున్నడం ద్వారా భూసారం ఎంతో మెరుగు పడుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. హాజరు మరియు కంకణాపల్లి గ్రామాలలో గ్రామ వ్యవసాయ సహాయకులు నాగమణి మరియు మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో నవధాన్యాల సాగుపై ఏర్పాటు చేసిన గిరిజన రైతుల అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ నవధాన్యాలు ఒక కొత్త శాస్త్రీయ విధానం అని వీటిని కలియ దున్నడం ద్వారా భూసారాన్ని ఎంతో మెరుగుపరుచుకోవచ్చని గిరిజన రైతులు ముఖ్యంగా వరి పంటను కేవలం తమ ఇంటి అవసరాల కోసమే వినియోగిస్తారని కాబట్టి నవధాన్యాలు సాగు చేసి కలియదున్ని అనంతరం వరి పంటను నాటడం ద్వారా రసాయన ఎరువులు మరియు పురుగుమందులు వినియోగించకుండానే నాణ్యమైన పంట పండుతుందని కాబట్టి గిరిజన రైతులందరూ నవధాన్యాలను సాగు చేసుకోవాలని సూచించారు జీడి మామిడి తోటల దిగుబడికి నవధాన్యాలను కలియదున్నాలని తెలిపారు నవధాన్యాలు పశువుల మేతగా పనికి వస్తాయని పాలలో వెన్న శాతం పెరుగుతుందని అంతేకాకుండా 15 నుండి 20 రకాల వేరు వ్యవస్థలు భూమిలోనికి చేరడం వలన కొన్ని కోట్ల జీవ వైవిధ్యం వేర్ల చుట్టూ చేరి అత్యంత విలువైన పోషకాలను పంటకు అందిస్తాయని ఇది ఒక కొత్త శాస్త్రీయ విధానమని తెలిపారు. అలాగే కొర్ర మరియు చోడి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని 90% రాయితీపై గిరిజన రైతులకు అందిస్తున్నామని రాగులు కిలో 49 రూపాయలకు పైగా మద్దతు ధర లభిస్తుందని కాబట్టి చిరుధాన్యాల విస్తీర్ణాన్ని పెంచాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రకృతి సేద్య యల్ వన్ కొండేటి విజయ్ మరియు రైతులు పాల్గొన్నారు.
