భూసారం బాగు నవధాన్యాలు సాగు వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట జూన్7 := పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో నవధాన్యాలను సాగు చేసి 30 లేదా 40 రోజుల తర్వాత కలియ దున్నడం ద్వారా భూసారం ఎంతో మెరుగు పడుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. హాజరు మరియు కంకణాపల్లి గ్రామాలలో గ్రామ వ్యవసాయ సహాయకులు నాగమణి మరియు మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో నవధాన్యాల సాగుపై ఏర్పాటు చేసిన గిరిజన రైతుల అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ నవధాన్యాలు ఒక కొత్త శాస్త్రీయ విధానం అని వీటిని కలియ దున్నడం ద్వారా భూసారాన్ని ఎంతో మెరుగుపరుచుకోవచ్చని గిరిజన రైతులు ముఖ్యంగా వరి పంటను కేవలం తమ ఇంటి అవసరాల కోసమే వినియోగిస్తారని కాబట్టి నవధాన్యాలు సాగు చేసి కలియదున్ని అనంతరం వరి పంటను నాటడం ద్వారా రసాయన ఎరువులు మరియు పురుగుమందులు వినియోగించకుండానే నాణ్యమైన పంట పండుతుందని కాబట్టి గిరిజన రైతులందరూ నవధాన్యాలను సాగు చేసుకోవాలని సూచించారు జీడి మామిడి తోటల దిగుబడికి నవధాన్యాలను కలియదున్నాలని తెలిపారు నవధాన్యాలు పశువుల మేతగా పనికి వస్తాయని పాలలో వెన్న శాతం పెరుగుతుందని అంతేకాకుండా 15 నుండి 20 రకాల వేరు వ్యవస్థలు భూమిలోనికి చేరడం వలన కొన్ని కోట్ల జీవ వైవిధ్యం వేర్ల చుట్టూ చేరి అత్యంత విలువైన పోషకాలను పంటకు అందిస్తాయని ఇది ఒక కొత్త శాస్త్రీయ విధానమని తెలిపారు. అలాగే కొర్ర మరియు చోడి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని 90% రాయితీపై గిరిజన రైతులకు అందిస్తున్నామని రాగులు కిలో 49 రూపాయలకు పైగా మద్దతు ధర లభిస్తుందని కాబట్టి చిరుధాన్యాల విస్తీర్ణాన్ని పెంచాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రకృతి సేద్య యల్ వన్ కొండేటి విజయ్ మరియు రైతులు పాల్గొన్నారు.

  • Related Posts

    నెల్లూరులో జూన్ 8న కీర్తిశేషులు ఆనం వెంకట రెడ్డి విగ్రహా పునః ఆవిష్కరణ

    మన న్యూస్ ,నెల్లూరు: .ప్రజా నాయకులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 8 ,ఆదివారం ఉదయం 9:30 గంటలకు నెల్లూరు నగరం రామలింగాపురం “ఆనం వెంకట రెడ్డి సెంటర్” నందు విగ్రహ పునః…

    యోగా తో ఆరోగ్యం,ఆనందం.

    మన న్యూస్ సాలూరు జూన్7:= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం మే 21నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి