

అభివృద్ధి,సంక్షేమాన్ని రెండు కళ్లుగా చూస్తూ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకొన్న డాక్టర్ పొంగూరు నారాయణ .మన న్యూస్, నెల్లూరు :రాష్ట్ర పురపాలక ,పట్టణాభి వృద్ధి శాఖామంత్రిగా డాక్టర్ పొంగూరు నారాయణ విజయ పరంపర కొనసాగిస్తూ ఏడాది పూర్తి చేసుకొన్న సందర్భంగా నెల్లూరు సిటీ నియోజక వర్గంలో సంబరాలు అంబరాన్ని అంటాయి .నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు ఆద్వర్యంలో సిటీ నేతలు కేక్ కట్ చేసి ఫుల్ జోష్ లో కనిపించారు .క్యాడర్ కు అండగా ,పేదల పెన్నిధిగా నిలుస్తున్న మంత్రికి జే జే లు పలికారు . మంత్రి నారాయణ వర్ధిల్లాలంటూ అంటూ నినాదాలతో హోరెత్తించారు .అటు రాష్ట్రంలో ,ఇటు సొంత నియోజకవర్గంలో ప్రజాసేవకోసం పరితపిస్తున్న మంత్రికి అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేసారు .






