


మనన్యూస్,నిజాంసాగర్( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని విద్య వనరుల కేంద్రంలో ప్రాథమిక,ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను ఎంఈవో అమర్ సింగ్ పంపిణీ చేశారు. మండలానికి 1 నుండి 10 వ తరగతి వరకు 6157 పుస్తకాలు వచ్చాయి.వాటిని 20 పాఠశాలకు పంపిణీ చేస్తామని ఎంఈవో తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మధుసూదన్ రాజు,సిఆర్ పి లు వెంకట్ రామ గౌడ్, శంకర్,రాజు,ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.