గూడూరు లో శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఉపపీఠం నందు సుందరకాండ హోమాలు పూర్తిచేసుకుని అష్టా షష్టి (68) పూర్ణాహుతులతో విశేష కార్యక్రమం

మన న్యూస్, గూడూరు, మే 29:29 మార్చి 2025 నుండి 29 మే 2025 వరకు కొనసాగుతున్న షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత ఏర్పడుతున్న ఏ ఇబ్బందులు మన పీఠ భక్తులకు కలగనివ్వకుండా సద్గురువుల శ్రీ విజయ దుర్గ పీఠాధిపతుల వారి యొక్క ఆదేశానుసారంగా గూడూరు లోని శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఉపపీఠం నందు ప్రతి నిత్యం సుందరాకాండ లోని సర్గలు రోజుకు ఒకటి చొప్పున మొత్తం 68 సర్గ లకు హోమం మరియు పారాయణ కొనసాగుతున్నది. మే 29వ తారీకు ఉదయం సుందరకాండ సర్గాలన్నీ పూర్తి చేసుకుని పై 68 సర్గ లకు 68 పూర్ణాహుతులు మరియు ఉదయం 10.51 మొదలు 11 గంటల లోపు మహా పూర్ణాహుతి నిర్వహించబడుతున్నది. కార్యక్రమాల వివరాలు: ఉదయం పీఠంలో నిర్వహించే నిత్య కార్యక్రమాలు ఐదు గంటలకు మొదలయ్యి 8 గంటలకు పూర్తవుతుంది.8:30 మొదలు 11 పర్యాయాలు మన్యుసూక్త పారాయణతో హోమం సుందరకాండలోని చివరి స్వర్గ హోమముశ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం హోమం శ్రీ హనుమాన్ లాంగుల స్తోత్ర హోమం తదుపరి శ్రీరామ పట్టాభిషేకం ఘట్టం యొక్క శ్లోకాలతో హోమం నిర్వహించబడుతుంది. తదుపరి 68 పూర్ణాహుతులు మరియు మహా పూర్ణాహుతి తో యాగం పూర్తవుతుంది. తదుపరి మధ్యాహ్నం 12 గంటల మొదలు భారీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున మీరందరూ తప్పనిసరిగా విచ్చేసి శ్రీ విజయ దుర్గ అమ్మవారి మరియు హనుమంతల వారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ విశేషమైన యాగంలో మీరు భాగస్వాములై అమ్మ కృపకు పాత్రులు కాగలరు.

  • Related Posts

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    మన న్యూస్ , కావలి: నెల్లూరు జిల్లా కావలి ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన జనిగర్ల మహేంద్ర యాదవ్ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారుఆదివారం పాతూరు నుంచి తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో కూటమినేతల ఆత్మీయ సమావేశానికి చేరుకుని తన…

    నెల్లూరులో జూన్ 8న కీర్తిశేషులు ఆనం వెంకట రెడ్డి విగ్రహా పునః ఆవిష్కరణ

    మన న్యూస్ ,నెల్లూరు: .ప్రజా నాయకులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 8 ,ఆదివారం ఉదయం 9:30 గంటలకు నెల్లూరు నగరం రామలింగాపురం “ఆనం వెంకట రెడ్డి సెంటర్” నందు విగ్రహ పునః…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు