

మన న్యూస్, నెల్లూరు ,మే 18:నెల్లూరు వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆమె కుమార్తె షరీనితో కలిసి పరిశీలించారు…హై స్కూల్ లో ఏర్పాట్లపై ఇండోర్ ప్లే ఎక్విప్ మెంట్ ఏర్పాటుపై పొంగూరు షరిణి పలు సూచనలు ఇచ్చారు.. ప్లే గ్రౌండ్ కాంపౌండ్ వాల్ నిర్మాణంలో మార్పులు చేయాలని మంత్రి నారాయణ ఆదేశించరు.. ఈ సందర్భంగా మంత్రి నారాయణ కుమార్తె షరిణి మీడియాతో మాట్లాడారు..ఐదేళ్లుగా మూతబడ్డ వీఆర్ హై స్కూల్ పై మంత్రి నారాయణ గారు ప్రత్యేక దృష్టిపెట్టారాని..దేశంలోనే మోడల్ స్కూల్ గా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్నారన్నారు..పిల్లలకి చదువులతో పాటు ఆటలు కూడా ముఖ్యమన్నారీ..ఆహ్లాదభరిత వాతావరణం ఉంటే పిల్లలు చదువుల్లో రాణించగలరని..పాఠశాల అంటే అన్ని సౌకర్యాలు ,సదుపాయాలు ఉండాలన్నారు..అందుకు తగ్గట్టుగా వీఆర్ హై స్కూల్ సిద్ధమౌతోందని తెలిపారు..జూన్ 12 వ తేదీన ప్రారంభం అవుతుందన్నారు..చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న P4 కింద కుమార్తె షరీని కూడా కొంతమంది విద్యార్థులను దత్తత తీసుకొంటానని చెప్పారు..అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ…..విఆర్సీకి పూర్వ వైభవం తెస్తానని ఎన్నికల్లో మాట ఇచ్చానని..ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానాని తెలిపారు..మంత్రి లోకేష్ ఆమోదంతో 15 కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టామని..ఎన్సీసీ ఆధ్వర్యంలో పనులు చకచకా సాగుతున్నాయన్నారు..నిరుపేద పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసేలా స్కూల్ ని డిజైన్ చేసామన్నారు..ఏడాదికి వెయ్యి మంది చొప్పున ఐదేళ్లలో ఐదువేలమంది పేదపిల్లలకి అడ్మిషన్ కల్పిస్తామని వెల్లడించారు..అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తామని హామీ ఇచ్చారు..అవసరమైతే p4 తో పేరెంట్స్ కి అండగా నిలబడతామని..విఆర్సీలో చేరబోయే పేద విద్యార్థుల్లో కొందరిని నాకూతురు షరిణి p4 కింద దత్తత తీసుకోవటం గర్వంగా ఉందన్నారు.. ఈ కార్యక్రమంలో కమిషన్ నందన్ తో పాటు టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
