నిజాంసాగర్ ప్రాజెక్టులో 24.9 లక్షల చేప పిల్లల విడుదల జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) మత్స్యకారుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత రావు అన్నారు.సోమవారం నిజాంసాగర్ మండలంలోని 20 గేట్ల వద్ద నిజాంసాగర్ ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, ఫిషరీస్ స్టేట్ ఫెడరేషన్ మెట్టు సాయికుమార్ తో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 100% సబ్సిడీతో చేప పిల్లలను చెరువులలో వదలడంతో..కార్మికులకు ఆర్థికంగా ఎదగడానికి వీలుంటుందన్నారు. గత ప్రభుత్వం బీద,బడుగు,బలహీన వర్గాల ప్రజలను దోచుకున్నారని ఆరోపణ చేశారు. నాసి రకం చేప పిల్లలను పంపిణీ చేసి మత్స్యకారులను మోసం చేయరాదని తెలిపారు. అదేవిదంగా అచ్చం పెట్ గ్రామంలోని చేపల ఉత్పత్తి కేంద్రం పునః ప్రారంభించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పార్టీగా కాంగ్రెస్ పార్టీకి సముచిత స్థానం ఉందని అన్నారు. ప్రాజెక్టులో 24.9లక్షల చేప పిల్లల విడుదల లక్ష్యం అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఎకనామి టూరిజం డెవలప్ చేయడం త్వరలో జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏలే.మల్లికార్జున్, అనీష్ పటేల్,మల్లయ్య గారి ఆకాష్,రాము రాథోడ్,గజ్జల కిరణ్,గౌస్ పటేల్,చిట్యాల నారాయణ,సంకు లక్ష్మయ్య,జిల్లా మత్స్యకారుల అధికారి త్రిపతి,తహసిల్దార్ బిక్షపతి,ఎంపిడిఓ గంగాధర్, జిల్లా అధ్యక్షుడు గాదం సత్యనారాయణ,ప్రాజెక్టు మత్స్యకరుల అధ్యక్షుడు బొయి రాములు,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!