

మనన్యూస్,తిరుపతి:డీఎస్సీ అభ్యర్థుల ఆరేళ్ల కలను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు విద్యాశాఖామంత్రి నారా లోకేష్ సాకారం చేశారని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం డీఎస్సీని విడుదల చేసి ఇది మంచి ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుందన్నారు.ఈ సందర్భంగా తిరుపతి ఆర్డీఓ ఆఫీసు ఎదుట డీఎస్సీ విడుదల సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులతో కలిసి చంద్రబాబు, లోకేష్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
వారి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. థ్యాంక్యూ సీఎం సర్, లోకేష్ అన్న అంటూ ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులు ప్లకార్డులు పట్టుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఇదే ప్రాంతంలో అభ్యర్థులతో కలిసి అనేక నిరసనలు, ధర్నాలు చేపట్టామని, కనీసం పట్టించుకున్న దాఖలాలులేవన్నారు. అభ్యర్థులు ఆర్తనాదాలు పెట్టినా స్పందించలేదన్నారు. కూటమి అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు, లోకేష్ లు నెరవేర్చి అభ్యర్థులకు అండగా నిలిచారన్నారు. అన్ని కేటగిరీలకు న్యాయం జరిగేలా డీఎస్సీ రూపొందించారన్నారు. అనంతరం తిరుపతి పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు కొట్టే హేమంత్ రాయల్ మాట్లాడుతూ డీఎస్సీ విడుదల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారని, అన్న విధంగానే సంవత్సరంలోనే 16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. ఆరేళ్లుగా నిరీక్షించి అలసిపోయిన అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా మాజీ సీఎం జగన్ రెడ్జి బుద్ధి తెచ్చుకోవాలని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర సభ్యులు ఆర్కే నాయుడు, విష్ణు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.