

మన న్యూస్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ నానక్ రామ్ గుడాలో గచ్చిబౌలి డివిజన్ బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు శివసింగ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ కార్యాలయాన్ని గురువారం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ ,గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు పార్టీ కార్యాలయం అందుబాటులో ఉంటుందని, గచ్చిబౌలి డివిజన్ లో మన బిజెపి కార్పొరేటర్ ఉన్నాడని, ఇంకా పార్టీ బలోపేతానికి కృషి చేయాలనీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. క్యాడర్ ఇప్పటికే బలంగా ఉందని ముందు ముందు బిజెపి ని మరింత బలోపేతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలనీ, వారికీ మేము అండగా ఉంటామని తెలిపారు..ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీజేపీ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ కంచర్ల ఎల్లేష్ , రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్ ,రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్,రాష్ట్ర నాయకులు నాగులు గౌడ్, మీన్ లాల్ సింగ్, సంతోష్ సింగ్ గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు,తిరుపతి, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కిషన్ గౌలి, గచ్చిబౌలి డివిజన్ ఓ బి సి ఉపాధ్యక్షులు హరీష్ శంకర్ యాదవ్, సీనియర్ నాయకులు రంజిత్ పూరీ, రాజేందర్,శ్రీకాంత్ రెడ్డి,గోపాల్,రాజు, శేఖర్,రంగస్వామి, బాబ్లీ సింగ్,శేఖర్, శంకేశ్ సింగ్, అరవింద్ సింగ్, దినేష్ , విశాల్ సింగ్, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాష్ట్ర నాయకులు, డివిజన్ నాయకులు, స్థానిక నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.