మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఆర్య బట్ట ఉన్నత పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థులకు నిజాంసాగర్ లోని నవోదయ పాఠశాలలో స్థానం సాధించారు.ప్రతిక్షణం,అశ్వ సే న సాయి,హర్షవర్ధన్. నవోదయ పాఠశాలలో స్థానం సంపాదించారు.రెండేళ్ల క్రితం స్థాపించిన ఆర్యభట్ట పాఠశాలలో రెండేళ్ల కాలంలోనే ముగ్గురు విద్యార్థులు నవోదయకు ఎంపిక కావడం పట్ల పాఠశాల యజమాన్యం విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అశోక్ మన న్యూస్ తో మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల అంకితభావం, వారి కృషి ఫలితంగా పాఠశాల స్థాపించి రెండు నెలల్లోనే తమ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు నవోదయకు ఎంపిక కావడం అభినందనీయమని ఆయన వెల్లడించారు.
