సైబర్ నేరాల నుండి అప్రమత్తంగా ఉండాలి

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని ఉట్కూరు మండల కేంద్రంలోని ప్రజలకు, యువకులకు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాలు, అపరిచిత వ్యక్తుల నుండి అప్రమత్తంగా ఉండాలని, ఐ పీ ఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడరాదని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం జరిగిందని ఎస్ఐ కృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా సందర్భంగా ఎస్ఐ కృష్ణంరాజు మాట్లాడుతూ,ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఒకవేళ సైబర్ నేరానికి గురైతే టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. యువకులు ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడరాదని సూచించారు. బెట్టింగ్స్ వల్ల ఆర్థికంగా నష్టపోయి, ఆత్మహత్యలకు దారితీస్తాయని, డబ్బులు లేకపోతే దొంగతనాలకు పాల్పడతారని అలాంటి వాటికి దూరంగా ఉండాలని, తమ పిల్లలు చుట్టుపక్కల వారు బెట్టింగ్ కు పాల్పడితే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల నుండి అప్రమత్తంగా ఉండాలని ఎవరి పైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్స్ మహేష్, విజయ్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///