రేవంత్ కు బీసీ సమాజం రుణపడి ఉంటుంది

బీసీ రిజర్వేషన్లు పెంచడంపై హర్షం వ్యక్తం చేసిన
కాంగ్రెస్ నాయకులు

బయ్యారం క్రాస్ రోడ్ లో ఘనంగా సంబరాలు

మనన్యూస్,పినపాక నియోజకవర్గం:విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం కోట కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం బయ్యారం క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాధం ధన్యవాదాలు తెలిపారు. జిల్లా అధ్యక్షులు పోడేం వీరయ్య, పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కార్యకర్తలతో కలిసి టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… దేశ చరిత్రలోనే ఎక్కడ లేనివిధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు పెంపుదల చేసిన కాంగ్రెస్ పార్టీకి బీసీ సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని, బీసీలకు ఆత్మగౌరవ ప్రతీకను అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీలు ఎల్లప్పుడు అండగా ఉంటారని అన్నారు. గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ బీసీలను పావులుగా వాడుకున్నదే తప్ప, బీసీల సంక్షేమానికి అభివృద్ధికి ఏమాత్రం బాటలు వేయలేదని విమర్శించారు. వచ్చే పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అధిక శాతం ప్రజలను చేకూరుతుందని , తద్వారా బీసీ సాధికార సాధిస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు రాజీవ్ యువ వికాసం పథకాలతో దేశం మొత్తాన్ని తెలంగాణ వైపు చూసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన సాగించారని కొనియాడారు. అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్లలాంటివని, మరో పాతికెళ్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే పరిపాలన కొనసాగిస్తుందని అన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు