నాదర్గుల్ లో గ్లాడియేటర్స్ కరాటే & తైక్వాండో అకాడమీ ప్రారంభం

మనన్యూస్,నాదర్గుల్:మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ లోని ప్రెస్ కాలనీలో వి చంద్రశేఖర్ నేతృత్వంలో గ్లాడియేటర్స్ కరాటే తైక్వాండో అకాడమీ ని ముఖ్య అతిథిలుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్,సినీ హీరో ఇంద్రసేన,తైక్వాండో గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి హాజరై ప్రారంభించారు.సినీ హీరో,వారియర్స్ కరాటే గ్రాండ్ మాస్టర్ ఇంద్రసేన,తైక్వాండో 29 సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత గ్రాండ్ మాస్టర్ ఎమ్ జయంత్ రెడ్డి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ ప్రస్తుత సమాజ పరిస్థితులలో మార్షల్ ఆర్ట్స్ విద్యను ప్రతి ఒక్కరూ కచ్చితంగా నేర్చుకోవాలని ముఖ్యంగా అమ్మాయిలు తమపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కొనేందుకు మార్షల్ ఆర్ట్స్ విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.మార్షల్ ఆర్ట్స్ విద్యపై తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలని తద్వారా ఆత్మ రక్షణతో పాటు క్రమశిక్షణ, పట్టుదల,మానసిక ధైర్యం ఏర్పడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్,బడంగ్ పేట్ కార్పొరేషన్ 1,2 అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి,రామిడి వీరకర్ణ రెడ్డి, కె వీణ,వి వర్ష,వి విగ్నేష్,వి శ్రీనివాస్,సుమ, గ్లాడియేటర్స్ కరాటే ఫౌండర్ అండ్ గ్రాండ్ మాస్టర్ ప్రవీణ్ చారి,స్వరూప చారీ, బ్లాక్ బెల్ట్ తేజస్విని,బ్లాక్ బెల్ట్సా యిరాజ్,ప్రీతిక,సదానంద్,శశిధర్,సుభద్ర,వీరన్న, కళావతి,విజయ్ కుమార్,శారద,బాబూరావు, భారతి, రాజు, రాకేష్,సుకన్య కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు