కొటికిపెంట నిర్వాసితులకు వసతి కలిపించాలి పార్వతీపురం గ్రీవెన్స్ లో సర్పంచ్ నాయుడు

మన న్యూస్:పాచిపెంట,డిసెంబర్ 16పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో 19 సంవత్సరాల క్రితం పెద్ద గెడ్డ జలాశయం నిర్మాణం కోసం సర్వస్వం కోల్పోయిన మా పంచాయతీ ప్రజలకు న్యాయం చేయాలని కోటికి పెంట సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడు పార్వతిపురం గ్రీవెన్స్లలో అధికారులను కోరారు. సోమవారం నాడు ఆయన కొంతమంది నిర్వాసితులతో కలిసి వారి సమస్యలపై జాయింట్ కలెక్టర్ కు మెమోరాండం అందించారు.2005 సంవత్సరంలో జలాశయం నిర్మాణంలో భూములు కోల్పోయామని దాని నిమిత్తం మాకు వేరే దగ్గర 18ఎకరాలు స్థలము ఇల్లులు నిర్మాణం కోసం చూపించారని,కానీ ఇంతవరకు వాటిలో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని ఆయన అధికారులకు తెలియజేశారు.19 ఏళ్ల క్రితం నుంచి తాము నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వాలు మారినా మా సమస్యలు తీరలేదని మా సమస్యలు తీరాలంటే మీరు స్పందించి తగు న్యాయం చేయాలని కోరారు.ఇల్లులు నిర్మించే స్థలం వద్ద వెంటనే మంచినీటి సౌకర్యము, పాఠశాల భవన నిర్మాణము, రహదారులు నిర్మాణం చేపట్టాలని కోరారు.గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం తో పలువురు గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే విచారణ జరిపించి పరిష్కార మార్గం చూపాలని ఆయన జిల్లాజాయింట్ కలెక్టర్,మిగతా అధికారులను కోరారు.వీరి దరఖాస్తు పై జాయింట్ కలెక్టర్ స్పందించి సమంత అధికారులతో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.నిర్వాసిత స్థలంలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆ గ్రామంలో కలుసిత నీరు త్రాగి చాలామంది ఇబ్బంది పడుతున్నారు.వారి బాధను వ్యక్తం చేశారు.ఈ సమస్య కూడా పరిశీలించి తగు న్యాయం చేస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.

  • Related Posts

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం లో మంగళవారం నూతన కమిటీ కార్యక్రమం ఆటో డ్రైవర్స్ యూనియన్ వారు నిర్వహించారు.ఏలేశ్వరం శ్రీ సాయి దుర్గ భవాని అండ్ జై దుర్గ భవాని ఆటో యూనియన్ నూతన కమిటీని ఎంపిక చేశారు.గౌరవ అధ్యక్షులుగా కుప్పల నాగభూషణం,…

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    మన ధ్యాస ,న్యూఢిల్లీ /నెల్లూరు, డిసెంబర్ 16:నెల్లూరు జిల్లా పరిధిలో రైల్వే ప్రాజెక్టుల పూర్తి చేయడమే లక్ష్యంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి పని చేస్తున్నారు. ఈ మేరకు భారత రైల్వే బోర్డు చైర్మన్ సంతోష్ కుమార్ ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి