

మన న్యూస్: మీర్ పెట్ శ్రీనివాస రామానుజన్ సేవలు చాలా విశిష్టమైనవని , చేసిన కృషి చాలా చారిత్రాత్మకమైనదని, మరవలేనిదని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాదులోని అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమం కు ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి ,శ్రీనివాస రామానుజన్ స్మారకార్థం నిర్వహించినటువంటి అల్ఫోర్స్ మ్యాథ్ ఒలంపియాడ్ టెస్ట్- 2024 నిర్వహణ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామానుజన్ చిన్నతనం నుండే గణిత శాస్త్రంపట్ల శ్రద్ద చూపెడుతూ గణిత శాస్త్రంలో అనేక విషయాలను కనుగొని గణిత శాస్త్రానికి నూతన అధ్యాయాన్ని రచించారని కొనియాడారు.ప్రతి విద్యార్థి రామానుజన్ వలే కృషిచేసి వారి మార్గాన్ని అనుసరించి గణితంలో అద్భుతాలు సృష్టించడమే లక్ష్యంగా ముందుకు సాగాలి అని అన్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో వారి వారు చేసిన సేవలు తెలపడానికై జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని అల్ఫోర్స్ మ్యాథ్ ఒలింపియాడ్ 2024 ను చాలా అట్టహాసంగా తెలంగాణ మహారాష్ట్రలో అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో వివిధ పాఠశాలల కు చెందినటువంటి 5 నుండి 10వ తరగతి విద్యార్థులకు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది అని అన్నారు.
హైదరాబాద్ జిల్లా కేంద్రంగా 1827 విద్యార్థులు,
రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షకు సుమారు 15809 మంది విద్యార్థులు హాజరై ప్రతిభను చాటారని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 22 న బహుమతులు అందజేయబడుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల యజమాన్యాలు, కరస్పాండెంట్లు , ప్రిన్సిపాల్స్, శ్రేయోభిలాషులు, గణిత శాస్త్ర ఉపాధ్యాయులు, విద్యా సంస్థల ప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.