కేటీఆర్ మూర్ఖత్వపు భ్రమ మరో పాతికేళ్ళు కాంగ్రెస్ ప్రజాపాలన ప్రజలకు స్వర్ణయుగం పత్రిక సమావేశంలో పినపాక మండల అధ్యక్షులు గోడిశాల రామనాథం.

మన న్యూస్: పినపాక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో మూడేళ్లు నాలుగేళ్లు మాత్రమేనంటూ, మాజీ మంత్రి కేటీఆర్ పగటికలలు కంటూ మూర్ఖత్వపు భ్రమలో తేలాడుతున్నాడని… పినపాక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాధం అన్నారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో బయ్యారం క్రాస్ రోడ్ లోని పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో మాట్లాడారు. పదవి ప్రభుత్వం పోయిందన్న తీవ్ర నిరాశలో కూరుకుపోయిన కేటీఆర్ కు, తమ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమం చూసి ఓర్వలేక పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు. మరో పాతికేళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, అప్పటివరకు కేటీఆర్ భ్రమలోనే ఉంటాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కల్లుగా ముందుకు సాగుతుందని అన్నారు. ఇప్పటికే ప్రతీ ఇంటికి ఉచిత కరెంటు, రైతులకు రెండు లక్షలు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాల భర్తీ చేసి, కాంగ్రెస్ జనరంజక పాలన అందించిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల మందికి అతి త్వరలోనే పక్కా ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని అన్నారు. డిసెంబర్ 09 సోనియా గాంధీ పుట్టినరోజున, రాష్ట్ర సచివాలయంలో నిజమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ జరుగుతుందని, ఆరోజు తెలంగాణ ప్రజలకు స్వర్ణయుగంలా దేశ చరిత్రలో మిగిలిపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగిరెడ్డి వెంకట్ రెడ్డి, గీద సాయిబాబు, గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొండేరు సంపత్ కుమార్, బోడ లక్ష్మణ్ రావ్ లు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా