అటల్ పెన్షన్ యోజన – భవిష్యత్‌ భద్రతకు ఆధారం…

శంఖవరం/కాకినాడ మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): సామాన్య మద్య తరగతి ప్రజానీకానికి రిటైర్మెంట్ తరువాత ఆర్థిక భద్రతను కల్పించడమే అటల్ పెన్షన్ యోజన పథకం ప్రధాన ఉద్దేశమని ఎస్‌.ఎల్‌.బి‌.సి‌. ఎ.జి.ఎం. శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద గల జయ స్పందన ఫంక్షన్ హాల్‌లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో అటల్ పెన్షన్ యోజనపై అవగాహన కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ఎల్‌.డి‌.ఎం‌. సి.హెచ్‌.ఎస్‌.వి‌. ప్రసాద్ అధ్యక్షత వహించగా, పి.ఎఫ్‌.ఆర్‌.డి‌.ఎ. సి.జి‌.ఎం‌. పరవేష్ కుమార్ ముఖ్య అతిధిగా, ఎస్‌.ఎల్‌.బి‌.సి‌. ఎ.జి.ఎం‌. శ్రీనివాస్ విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. డి‌.ఐ‌.సి‌. జి‌.ఎం‌. గణపతి, డి‌.ఆర్‌.డి‌.ఒ‌. పి‌.డి‌. శ్రీనివాసరావు, మెప్మా పి‌.డి‌. ప్రియంవధ, నాబార్డ్ ఎ.జి.ఎం‌. సోమినాయుడు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌.ఎం‌. బి‌.జి‌.ఆర్‌. నాయుడు, ఎస్‌.బి‌.ఐ‌. ఆర్‌.ఎం‌. కృష్ణ, ఎ.పి.జి.బి. ఆర్‌.ఎం‌. శ్రీనివాసరావు గౌరవ అతిధులుగా పాల్గొన్నారు.కార్యక్రమం ప్రారంభంలో అతిధులు జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమం నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ సందర్భంగా ఎస్‌.ఎల్‌.బి‌.సి‌. ఎ.జి.ఎం‌. శ్రీనివాస్ మాట్లాడుతూ మధ్య తరగతి ప్రజలు తమ రిటైర్మెంట్ తరువాత భద్రత కోసం తప్పనిసరిగా అటల్ పెన్షన్ యోజనలో చేరాలని సూచించారు. చిన్న మొత్తాలుగా సేవింగ్స్ చేయడం ద్వారా వృద్ధాప్యంలో నెలవారీ పెన్షన్ పొందే అవకాశం ఈ పథకం ద్వారా లభిస్తుందని తెలిపారు.పి.ఎఫ్‌.ఆర్‌.డి‌.ఎ. సి.జి‌.ఎం‌. పరవేష్ కుమార్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో సామాన్య ప్రజల పొదుపులు కీలకమని, ప్రతి వ్యక్తి తన భవిష్యత్తు భద్రత కోసం ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. బ్యాంకులు మరియు బిజినెస్ కారస్పాండెంట్లు గ్రామీణ ప్రజల్లో చైతన్యం కల్పించి ఈ పథకాన్ని ప్రతి ఇంటికి చేరవేయాలని ఆయన కోరారు.మెప్మా పి.డి. ప్రియంవధ మాట్లాడుతూ మహిళలు, స్వయంసహాయక సంఘాల ద్వారా అటల్ పెన్షన్ యోజన ప్రాధాన్యాన్ని ప్రచారం చేయడం ద్వారా గ్రామీణ మహిళల్లో భవిష్యత్ భద్రతపై అవగాహన పెంపొందించవచ్చని తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు తమ కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించగలరని అన్నారు. ఎల్‌.డి‌.ఎం‌. సి.హెచ్‌.ఎస్‌.వి‌. ప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా కాకినాడ జిల్లా వ్యాప్తంగా పథకం లబ్ధిదారుల సంఖ్యను పెంచే లక్ష్యంతో చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అటల్ పెన్షన్ యోజనలో చేరిన ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించగలరని అన్నారు.కార్యక్రమం ముగిసిన అనంతరం అతిథులను సాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలు బహుకరించి సత్కరించారు. కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, బిజినెస్ కారస్పాండెంట్లు, నాబార్డ్, మెప్మా, డి.ఆర్.డి.ఒ., డి.ఐ.సి. ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రజలు అటల్ పెన్షన్ యోజనపై అవగాహన పొందినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్ భద్రతపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని తెలిపారు.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?