కలిగిరి, అక్టోబర్ 01:(మనధ్యాస్ న్యూస్ ):////
కలిగిరి మండలం వెంకన్నపాలెం గ్రామం నందు స్వర్ణ వందనం, కుమారుడు స్వర్ణ డేవిడ్, 50 వ పుట్టినరోజు వేడుకలను ఆయన స్వగ్రామంలోని సెంటినరి చర్చి నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పుట్టినరోజు వేడుకలను స్వగ్రామైన వెంకన్నపాలెం సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నందు ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం గా ఉంది అని అన్నారు. అదేవిదంగా గ్రామం లోని నిరు పేదలకు బట్టలు అన్నదానం ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమైన విషయం అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో చర్చి పెద్దలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
