రైతు రాజ్యమే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ ద్వేయం

కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల పేదలకు న్యాయం జరుగుతుంది. ఘనంగా నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం…

పినపాక నియోజకవర్గం, మన న్యూస్:- బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సంబరాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు అభిమాన నేత పాయం వెంకటేశ్వర్లు బాణసంచా కాల్చి భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన మండల కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు… ఈ సందర్భంగా నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి, రైతు బాంధవుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలకు 1,00,00,000 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు..అనంతరం వారు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, రైతు రాజ్యమే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని, ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పాలనలోనే రైతులకు సముచిత ప్రాధాన్యం ఉంటుందని ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంది అని అన్నారు…అందరి కష్టంతో ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేశామని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు.. ప్రజా ప్రభుత్వం ఏర్పాటుఅయి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు..గత బిఆర్ఎస్ ప్రభుత్వం మాయ మాటలతో దొంగ హామీలతో తెలంగాణ ప్రజలందరినీ మోసం చేశారని మండిపడ్డారు.. గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు..ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్నిదని కనుకనే ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు..తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు ఉచిత కరెంటు, 500 గ్యాస్ సిలిండర్, రైతుల ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ, వరి ధాన్యానికి కింటాక్ 500 రూపాయలు బోనస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షలు వరకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు పథకాలను అమలు చేశామని, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన ప్రతి మహిళలకు నెలకు 2500 రూపాయలు ఆర్థిక సహాయం, వృద్ధులకి 4000 రూపాయలు నెలవారి పింఛను, అర్హులైన వారికి కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం పథకాల అమలకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు..తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అభివృద్ధి ఇస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓరవలేక బిఆర్ఎస్ నాయకులు కల్లబొల్లి కబుర్లు చెబుతూ పార్టీపై నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు..పినపాక నియోజకవర్గంలో ఈ ఏడాదిలోనే ఏడు మండలాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను పథకాలను ప్రజలకు అందజేయడం జరిగిందని పినపాక నియోజకవర్గన్ని రాష్ట్రం లోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతనని తెలిపారు.. అదేవిధంగా మండలంలో ఉన్న 16 పంచాయతీలను అభివృద్ధి చేసే బాధ్యత నాది అని హామీ ఇస్తూ, ఇక్కడ కూడా మండల ప్రజలకు తన జీవిత ఆశయం అయినా పులుపు బొంత ప్రాజెక్టుని పూర్తి చేస్తానని మాట ఇచ్చారు.. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి పోడుభూమి పట్టాలు ఇస్తామని భరోసా కల్పించారు.. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని ప్రతి ఒక్కరికి పార్టీలో గౌరవం దక్కుతుందని, పంచాయతీ ఎన్నికల్లో ప్రతి పంచాయతీని గెలిపించుకోవడం కోసం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయకేతనం ఎగరవేసేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజాక్షేత్రంలో ఉండాలని ఎటువంటి సమస్య వచ్చిన నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు..చివరగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించి మరొకసారి సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు తోలెం నాగేశ్వరరావు, పోలేబోయిన శ్రీవాణి తిరుపతయ్య, వట్టం సమ్మక్క, కుంజ వసంతరావు, మోకాళ్ళ పాపారావు, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల మహిళా అధ్యక్షురాలు చందా వెంకటరత్నమ్మ, మండల నాయకులు ఎర్ర సురేష్, మండల కార్యదర్శి షేక్ రఫీ సీనియర్ నాయకులు ఎట్టి నరసయ్య, వాసిరెడ్డి నేతాజీ, కొర్స బుచ్చయ్య,జట్ల సత్యం,మండల నాయకులు జలగం కృష్ణ, బరపటి వెంకన్న , పడిగా సమ్మయ్య,అత్తే సారయ్య,కోరం వెంకటేశ్వర్లు,వట్టం చుక్కయ్య, దొంతు మల్లయ్య, గాంధర్ల రామనాథం, కార్యకర్తలు,మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు…

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 8 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//