

- ఈ నెల 11 తేదీన డీ.ఈ.ఓ కార్యాలయం ఎదుట నిరసన.
- డీఈవో శ్రీమతి బీ వరలక్ష్మి గారికి యూటీఎఫ్ ధర్నా నోటీస్.
మన న్యూస్ చిత్తూరు :- కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురి చేస్తున్న…. అసంబద్ధ నిర్ణయాలైన అపార్ కార్డుల నమోదు, నిరంతరం ఏదో ఒక బోధ నేతర కార్యక్రమం పేరుతో విలువైన బోధన సమయాన్ని వృధా చేస్తున్నారని, పది శాతం ఉపాధ్యాయులకు మాత్రమే సెలవు మంజూరు, సెలవు రోజులు, పండుగ రోజుల సైతం కూడా పదవ తరగతి విద్యార్థుల పరీక్షల కోసం అసంబద్ధ యాక్షన్ ప్లాన్ రూపొందించడం వంటి వాటికి నిరసనగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి బి.వరలక్ష్మీ గారికి నిరసన పత్రాన్ని ఇస్తూ ఉపశమనము కలిగించని పక్షంలో తదుపరి కార్యాచరణలో భాగంగా డిసెంబరు 11వ తేదీన చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట యుటిఎఫ్ చిత్తూరు జిల్లా శాఖ పక్షాన నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తూ ధర్నాలో నోటీసులు ఇస్తున్న యు టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ, జిల్లా అధ్యక్షులు ఎం.సోమశేఖర్ నాయుడు,ప్రధాన కార్యదర్శి ఎన్.మణి గండన్, జిల్లా సహద్యక్షులు కె.రెడ్డెప్ప నాయుడు, రెహానా బేగం, జిల్లా కార్యదర్శి ఎం.పార్థ సారథి ,రేవతి, సారథి,మాధవ రెడ్డి,మధుసూధన రెడ్డి తదితరులు పాల్గొన్నారు .