

వింజమూరు మన న్యూస్ ప్రతినిధి ఆగస్టు 23 :///
కొండాపురం మండలం గరిమెనపెంట సొసైటీ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన అల్లిక మధు శనివారం వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించి శాలువా తో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అల్లిక మధు మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యత ను వమ్ము చేయక వన్నె తెస్తానని, రైతులకు అండగా ఉంటూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొండాపురం నాయకులు ఉన్నారు.