శ్రీరామ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

  • జెండా ఆవిష్కరణ చేసిన పర్వత రాజుబాబు.

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:-

మండల కేంద్రం శంఖవరం శ్రీరామ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తించు కోవాలని శంఖవరం ఎంపీపీ పర్వత రాజబాబు అన్నారు. 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని శంఖవరం గ్రామంలో గల శ్రీరామ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎంపీపీ పర్వత రాజబాబు జెండా ఆవిష్కరణ చేసి, దేశ నాయకులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ పర్వత మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం ఎంతో మంది పోరాట యోధుల త్యాగ ఫలితం, ఎంతోమంది నాయకుల పోరాటం కలగలిసి ఉందని అన్నారు. మన దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ చెప్పినట్లుగా నేటి బాలలే రేపటి పౌరులు, అన్నట్లు ప్రతి ఒక్క విద్యార్థి మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, పాటుపడి మన రాష్ట్ర, మన దేశ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులకు పర్వత రాజబాబు సూచించారు. ప్రిన్సిపాల్ సకిరెడ్డి గోవిందరావు మాట్లాడుతూ విద్యార్థులంతా దేశభక్తిని కలిగి ఉండాలని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల గురించి, భారతదేశం గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థిని షణ్ముకేశ్వరి భరతమాత వేషధారణ, విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. పరుగు పందెం, మ్యూజికల్ చైర్, వ్యాసరచన, డ్రాయింగ్, క్విజ్ తదితర పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఎంపీపీ పర్వత రాజబాబు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఆటల పోటీలలో బహుమతులు గెలుపొందిన విద్యార్థులను తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, యాజమాన్యం అభినందించారు. విద్యార్థులు సకిరెడ్డి మొనాలి,కట్టా నవ్య, రేలంగి ధనుశ్రీ, బండి తపస్వి,పిల్లా సత్య సౌమిక, కొప్పిశెట్టి పూర్ణిమ, చరిష్మా దేశభక్తి గేయాలను ఆలపించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు పర్వత వివేక్, బొమ్మిడి లిల్లియ్య, స్కూల్ సిబ్బంది జి నందిని,వి మాలతి, దేవి, బుజ్జి, భవాని, రామలక్ష్మి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు