ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ లో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గు మాటి వెంకటకృష్ణారెడ్డి..

కావలి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):

కావలి నియోజకవర్గంలోని 96 మంది లబ్ధిదారులకు రూ. 71,66,072 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అందజేశారు. శనివారం కావలి పట్టణంలోని సెల్ఫీ పాయింట్ వద్ద 100 అడుగుల ఎత్తులోని జాతీయ జెండా నీడన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడి, పలు కార్పొరేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొంది ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించని, సొంత నిధులు వెచ్చించుకున్న అర్హులైన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయని, ముఖ్యంగా వైద్య రంగంలో అందుబాటులో ఉన్న ఈ సేవలు అనేక కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నాయని ఆయన వివరించారు. రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా రికార్డు స్థాయిలో కావలి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇప్పటివరకు 534 మంది లబ్ధిదారులకు రూ. 5,11, 84,072 ఆర్ధిక సహాయం అందజేయడం జరిగిందని తెలిపారు. నిరంతరం రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్ళు కస్టపడి పనిచేస్తున్నారని తెలిపారు.

  • Related Posts

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ఆంధ్రప్రదేశ్ :(మన ద్యాస న్యూస్) : ప్రతినిధి నాగరాజు :/// ఆంధ్రప్రదేశ్లో నీ రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది కలెక్టర్లు ను బదిలీ చేసిన ప్రభుత్వం. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఓ ఆనంద్ నీ అనంతపురం జిల్లా…

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 4 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.