

మన న్యూస్, నెల్లూరు: అనారోగ్య కారణంతో నెల్లూరు మెడి కవర్ హాస్పిటల్ ల్లో చికిత్స పొందుతున్న 45వ డివిజన్ వైసిపి కార్యకర్త పసుపులేటి సునీల్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా సునీల్ తో మాట్లాడి….. పార్టీ అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి సునీల్ కు మెరుగైన వైద్యం అందించాలని చంద్రశేఖర్ రెడ్డి వైద్యులను కోరారు.
