మహానాడుకు విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు….. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు, మే 30:కడపలో మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమములో పాల్గొని, విజయవంతం చేసిన జిల్లా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభిమానులకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కడపలో ఈ నెల 27, 28, 29 మూడు రోజుల పాటు నిర్వహించిన మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా ముగిసిందని, ప్రత్యేకించి మహానాడులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి జాతీయ అధ్యక్షులుగా ఎన్నిక కావడం సంతోషకర విషయం అన్నారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకు ఉన్న విలువను ఈ మహానాడు ప్రస్ఫుటం చేసిందన్నారు. యువనేత, మంత్రి నారా లోకేష్ బాబు చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుందని, భవిష్యత్తుకు భరోసా కల్పించే దిశగా నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు గొప్ప సలహాలు, సూచనలను అందజేశారన్నారు. ఈ మహానాడులో తొలిసారి ఎంపీగా పాల్గొనడం ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే స్పూర్తితో ముందుకు సాగుతామన్నారు. మహానాడు నిర్వహణలో ఎందరో నేతలు కీలకంగా వ్యవహరించారని, ప్రతి ఒక్కరి కష్టంతో మహానాడు విజయవంతం అయ్యిందన్నారు. రవాణా దగ్గర నుంచి భోజనాల వరకు అన్ని విభాగాలు కలిసి పనిచేయడం తోనే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. పార్టీ అధినేత ఆదేశాలను అమలు చేస్తూ ముందుకు సాగుతామని, ప్రభుత్వానికి, పార్టీకి మరింత మంచి పేరు తెచ్చేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

  • Related Posts

    నెల్లూరులో జూన్ 8న కీర్తిశేషులు ఆనం వెంకట రెడ్డి విగ్రహా పునః ఆవిష్కరణ

    మన న్యూస్ ,నెల్లూరు: .ప్రజా నాయకులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 8 ,ఆదివారం ఉదయం 9:30 గంటలకు నెల్లూరు నగరం రామలింగాపురం “ఆనం వెంకట రెడ్డి సెంటర్” నందు విగ్రహ పునః…

    యోగా తో ఆరోగ్యం,ఆనందం.

    మన న్యూస్ సాలూరు జూన్7:= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం మే 21నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి