మధ్యాహ్న భోజన పథకం విధి విధానాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.

మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:మధ్యాహ్న భోజన పథకం అమలు,విధి విధానాలను ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు.ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించబడుతున్న మధ్యాహ్న భోజన పథకం అమలు మరింత మెరుగైన రీతులలో సమర్థవంతంగా నిర్వహించేందుకుగాను కార్యాచరణ పథకాన్ని తయారు చేసే క్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ను ప్రత్యేక పరిశీలన చేసి నివేదికలు సమర్పించాలని కోరిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మధ్యాహ్నం భోజన పథకం అమలు అయ్యే విధానం పాశాలల స్థాయి నుండి హాజరు,రోజువారి హాజరు రిపోర్టుల సమర్పణ,ఎంఈఓ కార్యాలయాల్లో సిద్ధం చేసే బిల్లుల వివరాల గురించి కలెక్టర్ పరిశీలించారు.కొత్తగూడెం విద్యాధికారి కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథక లక్ష్యాలు- అమలు విధానాలు-పాఠశాల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఏ విధంగా రిపోర్టులు పంపిస్తున్నారు మరియు బిల్లులు వాటి మంజూరు కు సంబంధించిన పూర్తి వివరాలను విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి,కొత్తగూడెం ఎంఈఓ ప్రభు దయాల్, ఫైనాన్సు అధికారి శ్రీనివాస్ రావు లను అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉన్న లోపాలను అధిగమిస్తూ మరింత సమర్థవంతంగా ఎలా అమలు చేయాలని విషయం కులంకషంగా చర్చించారు. మధ్యాహ్న భోజన పథకం మెరుగైన రీతుల్లో అమలయ్యేలా,బిల్లులు మరింత వేగంగా మంజూరు అయ్యేలా కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్ స్వయంగా రూపొందించారు.ఈ మేరకు కలెక్టర్ మరింత సమర్థవంతంగా మధ్యాహ్న భోజన పథకం అమలు అయ్యేలా ప్రభుత్వానికి తగిన సిఫారసులు చేయనున్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ మరియు కార్యాలయ సిబ్బంది,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..