రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్.. ఆ విషయంపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం

Harish Rao: తెలంగాణలో రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి.. రైతులను మోసం చేసింది. ఇక్కడి ప్రజలను మోసం చేసింది చాలదన్నట్లు.. ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఆరు హామీల్లో మొదటి హామీనే అమలు చేయలేదని విమర్శించారు. కానీ, రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లి అబద్ధాలు చెబుతున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ. 2500 ఇస్తామని హామీ ఇచ్చింది.. ఇప్పటికీ 11 నెలలు అవుతోంది.. మహిళలకు డబ్బులు ఇచ్చారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. మహారాష్ట్రకు వెళ్లి మాత్రం తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినట్లు చెబుతున్నారని రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 40లక్షల మందికి రుణమాఫీ జరిగిందని ఏఐసీసీ ట్విటర్ లో ప్రచారం చేస్తోంది.. 20లక్షల మంది రైతులకే రుణమాఫీ జరిగింది.. ఇంకా 22లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉంది. ఆలస్యంగా చేసిన రుణమాఫీ వల్ల రైతులు వడ్డీ కట్టాల్సి వచ్చిందని హరీశ్ రావు అన్నారు

  • Related Posts

    భారీ గాలులకు అనేక చోట్ల నెలకొరిగిన చెట్లు, కూలిన ఇంటి పై కప్పులు….

    మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురు గాలుల నేపథ్యంలో అనేక చోట్ల చెట్లు నెలకొరిగాయి.గద్వాల పట్టణం న్యూస్ హోసింగ్ బోర్డు కాలనీలో వేప చెట్టు,20 వ వార్డు లో భారీ వృక్షం, విశ్వవేశ్వరయ్య పాఠశాల ఆవరణలో 40 యేండ్ల వృక్షం నెలకొరోగగా,…

    పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి

    మనన్యూస్,నారాయణ పేట:మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలకు పిడుగు పాటుకు గురై ఉప్పర్పల్లి గ్రామానికి చెందిన మేస్త్రి ఆంజనేయులు (34) దాదన్ పల్లి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేడు విద్యుత్తు అంతరాయం—ఇంజనీర్ కుళ్లాయప్ప.

    నేడు విద్యుత్తు అంతరాయం—ఇంజనీర్ కుళ్లాయప్ప.

    జలదంకి మండలం కమ్మవారిపాలెం లో గ్రామ కమిటీలు ఎన్నిక,,, ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్….!!

    జలదంకి మండలం కమ్మవారిపాలెం లో గ్రామ కమిటీలు ఎన్నిక,,, ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్….!!

    టిడిపి సీనియర్ నేత ముందలకు మోహన్ రావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ..

    టిడిపి సీనియర్ నేత ముందలకు మోహన్ రావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ..

    ముఫ్ఫై ఏళ్ల గడిచిన వారి స్నేహాం పదిలం…

    • By APUROOP
    • April 27, 2025
    • 6 views
    ముఫ్ఫై ఏళ్ల గడిచిన వారి స్నేహాం పదిలం…

    భారీ గాలులకు అనేక చోట్ల నెలకొరిగిన చెట్లు, కూలిన ఇంటి పై కప్పులు….

    భారీ గాలులకు అనేక చోట్ల నెలకొరిగిన చెట్లు, కూలిన ఇంటి పై కప్పులు….

    పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి

    పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి