తిరుపతి ఆగస్టు 19 మన ద్యాస

ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం మరియునివారణాత్మక వైద్య సంరక్షణకు మరింత ప్రాధాన్యతనిస్తూ అమర రాజా సంస్థ వార్షిక వైద్య పరీక్షల కార్యక్రమాన్ని బుధవారం, ఆగస్టు 19న అమర హాస్పిటల్ భాగస్వామ్యంతో ఘనంగా ప్రారంభించింది. ఈ ఏడాది వార్షిక వైద్య పరీక్షల్లో భాగంగా తొలిసారిగా 45 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఉద్యోగులకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను ప్రవేశపెట్టారు. ఉద్యోగుల్లో సరదాగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన వైద్య సహాయాన్ని సకాలంలో అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. కార్యక్రమ ప్రారంభోత్సవంలో డా. ప్రసాద్ గౌరినేని చైర్మన్, అమర హాస్పిటల్; డా రామాదేవి గౌరినేని, మేనేజింగ్ డైరెక్టర్, అమర హాస్పిటల్ భాగ్యలక్ష్మి, సీవోవో, అమర హాస్పిటల్; ప్రశాంత్ తివారీ, సీఎస్ఓ, అమర రాజా; డా. చంద్రబాబు, చీఫ్ మెడికల్ ఆఫీసర్, అమర రాజా నళిని కుమార్, హెడ్ షేర్డ్ సర్వీసెస్, అమర రాజా; శ్రీరామ్ ఎన్వీ, సీఈఓమంగళ్ ఇండస్ట్రీస్; శ్రీరామ్ వై., బిజినెస్ హెడ్ గల్లా ఫుడ్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. ప్రసాద్ గౌరినేని, రామాదేవి గౌరినేని ఉద్యోగుల ఆరోగ్యం, కాకుండా, ఎంతో సురక్షితమైన, సంక్షేమం యొక్క ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఉద్యోగి ఆరోగ్యంగా ఉండటం వ్యక్తిగత సంక్షేమానికే ఉత్పాదకమైన మరియు సుస్థిరమైన సంస్థ కీలకమని నిర్మాణానికి పేర్కొన్నారు. వార్షిక వైద్య పరీక్షలు 2026లో మరో ముఖ్యమైన అంశంగా లి’వైటాలిటీ ఇండెక్స్’లిను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఉద్యోగులు తమ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడంతో పాటు, గతంలో నిర్వహించిన ఆరోగ్య పరీక్షల ఫలితాలతో ప్రస్తుత ఫలితాలను పోల్చుకుని తమ ఆరోగ్య పురోగతిని తెలుసుకునే అవకాశం , కలుగుతుంది. వార్షిక వైద్య పరీక్షలు 2026లో దేశవ్యాప్తంగా సుమారు 24,020 మంది : ఉద్యోగులు వైద్య పరీక్షలకు అర్హులు కాగా, ఈ సంస్థ కార్యక్రమం సంస్థకు చెందిన ఐదు తయారీ కేంద్రాల్లో నిర్వహించబడుతోంది. అమర హాస్పిటల్, అమర రాజా సంస్థల సమన్వయంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో నివారణాత్మక వైద్య సంరక్షణ, ఆరోగ్య సమస్యలను ప్రారంభదశలోనే గుర్తించడం మరియు ఆరోగ్యవంతమైన ఉద్యోగ బృందాన్ని నిర్మించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సాధారణ వార్షిక వైద్య పరీక్షలకు మించి, ఉద్యోగుల్లో నివారణాత్మక ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు అమర రాజా చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో వార్షిక వైద్య పరీక్షలు 2026 మరో ముఖ్యమైన ముందడుగు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, ‘వైటాలిటీ ఇండెక్స్’ వంటి కొత్త కార్యక్రమాల ప్రవేశంతో ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, సకాలంలో వైద్య సహాయం అందించే విధానం మరింత బలోపేతమైంది. ఉద్యోగుల ఆరోగ్యం కేవలం వైద్యపరమైన ప్రాధాన్యత మాత్రమే కాదు… సంస్థకు అత్యంత కీలకమైన ప్రాధాన్యత అనే అమర రాజా నిబద్ధతను వార్షిక వైద్య పరీక్షలు 2026 కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *